iDreamPost

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ఏపీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తున్న సంగీత ట్రావెల్స్ కు చెందిన బస్సు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ఒడిశాకు చెందిన ధనేశ్వర్ దళపతి (24), జీతు హరిజన్(5), సునేనా హరిజన్ (2)లతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి