iDreamPost

UP ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. రూ.780 కోట్ల ఆస్తులు.. ఎవరీమె?

  • Published Apr 18, 2024 | 10:08 AMUpdated Apr 18, 2024 | 10:08 AM

Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ మహిళ ఒకరు యూపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఆ వివరాలు..

Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ మహిళ ఒకరు యూపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 10:08 AMUpdated Apr 18, 2024 | 10:08 AM
UP ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. రూ.780 కోట్ల ఆస్తులు.. ఎవరీమె?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి రంగం సిద్ధం అయ్యింది. నేటి నుంచి నాలుగో దశ ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇక ఎన్నికల వేళ కొన్ని ఆసక్తికర వార్తలు వెలుగు చూస్తుంటాయి. అప్పటి వరకు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన వ్యక్తులు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అవుతుంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ పోటీ చేయనుంది. ఇక ఆమె బ్యాగ్రౌండ్ మాములుగా లేదు. ఏకంగా 780 కోట్లకు అధిపతి. తెలుగు మహిళ కావడం.. అందునా సంపన్నురాలు కావడంతో.. ఆమె గురించి వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..

యూపీలోని జౌన్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్ సభ టికెట్ ఇచ్చింది. శ్రీకళారెడ్డి పుట్టింది తెలంగాణలో కానీ ఆమె అత్తగారిల్లు మాత్రం యూపీ. శ్రీకళారెడ్డి భర్త ధనుంజయ్ సింగ్ జౌన్‌పుర్ మాజీ ఎంపీ. స్థానికంగా కోటీశ్వరుడుగా, బీఎస్పీ అధినేత్రి మాయవతికి బాగా సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. అయితే గతంలో కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు ఆయనపై నిషేధం విధించింది.

దాంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జౌన్‌పుర్ ఎంపీ టికెట్‌ను ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డికి కేటాయించింది బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. ఇక ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్‌ కుష్వాహా బరిలోకి దిగారు. దాంతో జౌన్‌పుర్ లోక్ సభ ఎన్నిక పోరు ఆసక్తికరంగా మారింది.

శ్రీకళా రెడ్డి బాల్యం, చదువు, పెళ్లి..

శ్రీకళా రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం. ఆమె తండ్రి జితేందర్‌రెడ్డి నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలానే 1972లో హుజూర్ నగర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ శ్రీకళా రెడ్డి కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. దాంతో శ్రీకళారెడ్డి బాల్యం మెుత్తం అక్కడే గడిచింది.

చదువు విషయానికి వస్తే.. ఇంటర్ వరకు చెన్నైలో చదివింది. హైదరాబాద్ లో బీకామ్ కోర్సు పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది. ఇక 2017లో శ్రీకళా రెడ్డి వివాహం జరిగింది. యూపీకి చెందిన రాజకీయ నాయకుడు ధనుంజయ్ సింగ్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఎంతో నిరాడంబరంగా జరిగింది.

దాంతో వివాహం తర్వాత.. చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు నటుడు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. శ్రీకళారెడ్డి.. ధనుంజయ్‌సింగ్‌ మూడో భార్య. మొదటి భార్య చనిపోవడం, రెండోభార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీల్లో చేరి తన లక్ పరీక్షించుకున్నారు. కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో.. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

శ్రీకళారెడ్డి వందల కోట్లకు అధిపతి. ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి