iDreamPost

వీడియో: డైరెక్టర్ హరీశ్ శంకర్ మంచి మనసు! రోడ్డుపై కారు తోస్తూ!

టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ వీడియోతో నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ వీడియోతో నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో: డైరెక్టర్ హరీశ్ శంకర్ మంచి మనసు! రోడ్డుపై కారు తోస్తూ!

టాలీవుడ్ టాలెండ్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గద్దల కొండ గణేష్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ డేరింగ్ డైరెక్టర్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తుండగా.. రాజకీయాలతో పవన్ బిజీగా మారడం, ఆ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో..అంతలో మాస్ మహారాజా రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ షురూ చేశారు. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తి చేసింది. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కాగా, హరీశ్ ఇప్పుడో మంచి పని చేసి నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. హైదరాబాద్ నగరంలో నడి రోడ్డులో కారు ఆగిపోతే.. హరీశ్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నిర్మాత రవిశంకర్ కారును తోశారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కారు ఆగిపోవడంతో వెనుకగా వస్తున్న వీరిద్దరూ అది గమనించి.. సమస్య అడిగి తెలుసుకుని సాయం చేశారు. వీరికి మరికొంత మంది తోడయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్టార్ డైరెక్టర్ అంటే చాలా బిజీగా ఉంటారు. తలకు మించిన పనులుంటాయి. కానీ రోడ్డుపై వాహనం ఆగిపోగానే.. తన మానాన తాను వెళ్లకుండా.. సగటు మనిషిలా ఆలోచించి..తన వంతు బాధ్యతగా ఫీల్ అయ్యి.. ఆ వ్యక్తికి సాయం చేశారు.

స్టార్ డైరెక్టర్, నిర్మాత వారి స్థాయి, స్టేటస్ మరిచి.. హెల్ప్ చేయడంపై చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..రవితేజ షాక్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన హరీశ్ శంకర్.. మిరపకాయ్‌తో స్టార్ దర్శకుడు అయ్యారు. ఇక పవన్‌తో చేసిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్. రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే సినిమాలు డేరింగ్ డైరెక్టర్ అన్న ముద్ర పడేలా చేశాయి. రవితేజ, హరీశ్ కాంబోలో ముచ్చటగా మూడవ చిత్రం తెరకెక్కబోతోంది. మిరప కాయ్ హిట్ కావడంతో మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.  ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి