iDreamPost

ప్రేమించాడని ప్రియుడిని నడిరోడ్డుపై చంపిన ప్రియురాలి కుటుంబ సభ్యులు!

ప్రేమించాడని ప్రియుడిని నడిరోడ్డుపై చంపిన ప్రియురాలి కుటుంబ సభ్యులు!

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని ప్రియురాలి కుటుంబ సభ్యులు అడ్డగించి నడి రోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సైతం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని బ్రహ్మపురికి ప్రాంతానికి చెందిన సల్మాన్ (25), జాఫ్రాబాద్ కు చెందిన ఓ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమాయణం అలా రెండేళ్లు గడిచింది. అయితే, ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు సల్మాన్ ను హెచ్చరించి వదిలేశారు. కానీ, ఇవేం పట్టించుకుని సల్మాన్ తన ప్రియురాలితో చెట్టా పట్టాలేసుకుని తిరిగాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులు తెలిసింది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ యువతి తండ్రి, సోదరుడు.. ఎలాగైన సల్మాన్ ను హత్య చేయాలని ప్లాన్ గీశారు. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం చౌహాన్ బంగర్ ప్రాంతంలో వెళ్తుండగా సల్మాన్ ను అడ్డగించారు.

ఆ తర్వాత యువతి తండ్రి, సోదరుడు సల్మాన్ ను కత్తి పొడిచి అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిచారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుమారుడి మరణవార్త తెలిసి మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమించాడని యువకుడిని చంపిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దంపతుల గలీజ్ పనులు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను నమ్మించి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి