iDreamPost

బినామీల రాజధానా?

బినామీల రాజధానా?

Trending in Social Media

చాగంటీ నాగశ్రీనివాస సతీష్ అలియాస్ ,
సతీష్ చాగంటీ .

టీడీపీ సోషల్ మీడియాలో అత్యంత కీలక వ్యక్తి .2014 లో బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపెన్ తో వెలుగులోకి వచ్చిన ఈ వ్యక్తి . ఆ సమయంలో వైఎస్ జగన్ పై లక్ష కోట్లు అంటూ తీవ్ర అసత్య ఆరోపణలు చేయటంలో కానీ , బాబే రావాలి అనే క్యాంపెన్ నడపటంలో , టీడీపీ అనుకూల వర్గ , ముఖ్యంగా ఒక సామాజిక వర్గ NRI లను కూడగట్టి విదేశీ నిధులు సేకరించటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి .

బాబు అధికారంలోకి వచ్చిన పిదప అందుకు భారీగానే ప్రతిఫలం పొందాడు . ఒకటి కాదు రెండు కాదు రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన వెంకటాయపాలెం గ్రామంలో కృష్ణా ఒడ్డున సర్వే నంబర్స్ 48 , 49 , 59 62 , 63 , 64 లలో ఎకరాకు ఏడాదికి లక్ష చొప్పున నామమాత్రపు లీజుతో ఏకంగా ఎనిమిది ఎకరాల భూమి 33 ఏళ్ల లీజుకి కొట్టేసాడు .

ఈ కుంభకోణం కోసం సతీష్ చాగంటి మొత్తం 4 కంపెనీలు పెట్టాడు .అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ , కోస్తా మెరీనా అండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా అగ్రి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలని పెట్టారు . ఈ నాలుగు కంపెనీలలో ఉమ్మడిగా ఉన్నది కానుమిల్లి వెంకట సూర్యప్రకాశరావు అనే అతను . సతీష్ చాగంటి డైరెక్టర్ గా ఉన్న మొదటి రెండు మెరీనా కంపెనీలకి ఈ కాంట్రాక్టు ఇచ్చారు .

విశేష ఏంటంటే ఈ కంపెనీలన్నీ ఒకే అడ్రస్ కింద రిజిస్టర్ చేసారు . 33-21-33 , సీతారామపురం , ఏలూరు రోడ్ , విజయవాడ , కృష్ణ జిల్లా , ఏపీ . ఇదే అడ్రెస్ మీద కంపెనీలు రిజిస్టర్ చేసారు .

ఇంకో అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఇదే అడ్రస్ తో ( డోర్ నెంబర్ తో సహా ) మొత్తం 491 కంపెనీలు రిజిస్టర్ చేసారు . ఇవి మొత్తము డమ్మీ సూట్కేసు కంపెనీలు . దాదాపుగా కంపెనీలు అన్నీ ( 90 శాతం పైగా ) 2015 నుండి 2019 మార్చి మధ్యలోనే స్థాపించారు .

ఈ కంపెనీకి భూమి ఇచ్చిన నదీ ముఖ ప్రాంతంలో ఎకరా విలువ పది కోట్ల పై మాటే . ఇప్పుడు బాబు గారి లెక్కల్లో గజం లక్ష చొప్పున లెక్కిస్తే దాదాపు నాలుగు వందల కోట్ల విలువైన భూమిని అత్యంత చవకగా కోస్తా మెరీనా పేరుతో ఇతగాడు కొట్టేసిన తీరు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే . ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏంటో తెలుసా . “అమరావతి మెరీనా ” దీని ఉద్దేశ్యం కృష్ణాలో బోటింగ్ , రిక్రియేషన్ .

టీడీపీ నేతల సహజ సిద్ధమైన విలాసాలకు బ్యాంకాక్ తరహాలో ఏర్పాటు అయిన ప్రాజెక్టు . 2018 జూన్ రెండున టెండర్ పిలవటానికి మూడు రోజుల ముందు హడావుడిగా సతీష్ చాగంటి ఏర్పాటు చేసిన ఈ డమ్మీ కంపెనీకి ప్రాజెక్టు దక్కడానికి నిబంధనలు అత్యంత సరళంగా విధించారు . ఈ కంపెనీకి ఏ విధమైన అనుభవము లేకున్నా ఫర్వాలేదు . అనుభవం ఉన్న కంపెనీతో టై అప్ అయ్యుంటే చాలు అని పిల్లోడి నెత్తిన భోగి పళ్ళు కుమ్మరించినట్టు రైతులనుండి లాక్కున్న కోట్ల విలువైన భూమిని సతీష్ ఒళ్ళో కుమ్మరించారు .

వంద కోట్ల భూమి మాత్రమే కాదు విలువైన ప్రజా వనరుల పై ఏటా వంద కోట్ల ఆదాయం అంచనాలతో రూపొందిన ఈ విలాసాల కంపెనీ రూపాయి పెట్టుబడి లేకుండా ఈ ముప్పై మూడు ఏళ్ల లీజు పరిమితిలో దోచుకొనే మొత్తం 3300 అక్షరాలా మూడు వేల మూడు వందల కోట్లు . అందులో సతీష్ చాగంటి వాటా 1700 కోట్ల పై మాటే ఇలా ఇంకెంత మందికి అడ్డికీ సేరుకి అప్పనంగా కట్టబెట్టాడో మన బాబు గారు .

అలా దొడ్డి దారిలో లోకేష్ కి , బాబుకి డబ్బులిచ్చి భూములు కొట్టేసిన వారందరూ చేస్తున్న ఒత్తిళ్ల వల్లే ఈ రోజు బాబు గారు రైతుల ముసుగులో రాజధాని పోరాటం చేస్తున్నరు తప్ప , ఆ పోరాటంలో నిజమైన రైతుల పాత్ర ఎంత అంటే నామమాత్రం అని చెప్పొచ్చు .

ఇతనే కాదు అమరావతి రాజధాని పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఒక్కో బడా బాబు వెనుక ఇలాంటి కుంభకోణాలు ఒక్కొక్కటి ఉన్నాయనటంలో సందేహం లేదు . సోషల్ మీడియాలోనే ఈ విధంగా భారీ స్థాయిలో లబ్ది పొందిన వారు మరో నలుగురైదుగురు ఉన్నారని ప్రభుత్వం వద్దనున్న ప్రాథమిక సమాచారం .

ఇలాంటి దోపిడీ దారులు ఇంకెందరు ఉన్నారో మొత్తాన్ని సమగ్రంగా విచారించి దోషులకు శిక్ష పడేట్టు చూసి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పై ఉంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి