iDreamPost

బాబర్​పై పాక్ లెజెండ్ సీరియస్.. కోహ్లీని ఎలా అడుగుతావంటూ..!

  • Author singhj Published - 12:50 PM, Sun - 15 October 23
  • Author singhj Published - 12:50 PM, Sun - 15 October 23
బాబర్​పై పాక్ లెజెండ్ సీరియస్.. కోహ్లీని ఎలా అడుగుతావంటూ..!

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు.. ఈసారి ఫేవరెట్ నుంచి హాట్ ఫేవరెట్​గా మారింది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో పాటు పసికూన ఆఫ్ఘానిస్థాన్​పై విజయాలతో మంచి జోష్ మీద ఉన్న రోహిత్ సేన.. మూడో మ్యాచ్​లో పాకిస్థాన్​పై సూపర్బ్ విక్టరీతో వరల్డ్ కప్​లో మిగతా ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. మొదట మహ్మద్ సిరాజ్ (2/50), కుల్​దీప్ యాదవ్ (2/38), జస్​ప్రీత్ బుమ్రా (2/19), రవీంద్ర జడేజా (2/38).. ఇలా మెయిర్ బౌలర్స్ అందరూ అదరగొట్టడంతో 42.5 ఓవర్లలో 191 రన్స్​కే దాయాది టీమ్​ కుప్పకూలింది.

పాక్ జట్టులో బాబర్ ఆజం (50), మహ్మద్ రిజ్వాన్ (49), ఇమాముల్ హక్ (36) మాత్రమే రాణించారు. ఒక్కసారి బాబర్ ఔటయ్యాక ఆ టీమ్ బ్యాటర్లు అందరూ పెవిలియన్​కు క్యూ కట్టారు. పాక్ పతనంలో తన కెప్టెన్సీ స్కిల్స్​తో, డెసిజన్స్​తో కీలకమైన పాత్ర పోషించిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ టీమ్​ను ముందుండి నడిపించాడు. రోహిత్ (86)తో పాటు శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) కూడా సత్తా చాటడంతో మరో 117 బాల్స్ ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్​ను అందుకుంది టీమిండియా. ఈ విజయంతో రోహిత్ సేన నెట్​రన్​ను మరింత మెరుగుపర్చుకొని పాయింట్స్ టేబుల్​లో ఫస్ట్ ప్లేస్​కు దూసుకెళ్లింది.

మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదున్న పాకిస్థాన్​.. టీమిండియాతో పోరులో పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. బాబర్-రిజ్వాన్ పార్ట్​నర్​షిప్ టైమ్​లో కాస్త పోటీలో ఉన్నట్లు కనిపించినా.. ఒక్కసారి పాక్ కెప్టెన్ ఔటయ్యాక మ్యాచ్ భారత్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్​లో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముందుండి లీడ్ చేయాల్సిన అతను రాంగ్ టైమ్​లో చెత్త షాట్ కొట్టి వికెట్ పారేసుకున్నాడు. అలాగే భారత ఇన్నింగ్స్ టైమ్​లో హ్యారీస్ రౌఫ్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్​ను కాదని హసన్ అలీని బౌలింగ్​కు దింపాడు.

మ్యాచ్​లో పట్టు సాధించాల్సిన టైమ్​లో టీమిండియాకు ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చాడంటూ పాక్ ఫ్యాన్స్​ బాబర్​పై సీరియస్ అవుతున్నారు. అయితే మ్యాచ్ అనంతరం బాబర్ చేసిన ఓ పనిపై ఆ దేశ లెజెండరీ పేసర్ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. జెర్సీ కావాలని కోహ్లీని బాబర్ అడిగాడు. ఇది కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీంతో వసీం అక్రమ్ సీరియస్ అయ్యాడు. టీషర్ట్ అడిగేందుకు ఇది కరెక్ట్ టైమ్ కాదన్నాడు. కోహ్లీని జెర్సీ కావాలని బాబర్ అడగడం తప్పన్నాడు. మ్యాచ్​లో పాక్ ఓడిన టైమ్​లో వెళ్లి కోహ్లీని జెర్సీ ఇమ్మని అనడం బాబర్ తప్పన్నాడు. మరి.. బాబర్​పై వసీం అక్రమ్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: రోహిత్‌ శర్మ బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి