iDreamPost

యాంకర్ రష్మీని అవమానించిన కమెడియన్.. రాత్రికి రమ్మంటూ ఘోరంగా..!

  • Author singhj Published - 06:47 PM, Sat - 22 July 23
  • Author singhj Published - 06:47 PM, Sat - 22 July 23
యాంకర్ రష్మీని అవమానించిన కమెడియన్.. రాత్రికి రమ్మంటూ ఘోరంగా..!

బుల్లితెర యాంకర్​గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రష్మి ఒకరు. ఎప్పుడూ చలాకీగా, హుషారుగా ఉంటూ తాను హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్​లో ఎంతో జోష్​ను నింపుతుంటారామె. రష్మి ఒక షో హోస్ట్ చేస్తున్నారంటే అందులో పండే వినోదం, ఎంటర్​టైన్​మెంట్ వేరే లెవల్ అనే చెప్పాలి. అందుకే అతి తక్కువ టైమ్​లోనే రష్మి ఫుల్​ క్రేజ్​ను సంపాదించారు. ఒకవైపు యాంకర్​గా బుల్లితెర ఆడియెన్స్​ను అలరిస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర మీద కూడా ఈ అందాల భామ తన టాలెంట్​ను ప్రదర్శిస్తున్నారు. యాంకరింగ్​తో పాటు యాక్టింగ్ ఛాన్సులతోనూ కెరీర్​లో ఎంతో బిజీగా ఉన్నారీ ముద్దుగుమ్మ.

యాంకర్​గా, నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రష్మి.. ప్రముఖ టీవీ ఛానెల్​లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోకు హోస్టింగ్ చేస్తారనే విషయం తెలిసిందే. ఇందులో కమెడియన్స్ చేసే స్కిట్లు చాలా ఫేమస్. రష్మి చేసే అల్లరి, ఆమె డ్యాన్సులు, గ్లామర్​ కూడా ‘జబర్దస్త్’కు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ‘జబర్దస్త్’తో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు కూడా రష్మి యాంకరింగ్ చేస్తున్నారు. అయితే ఈ షోలో ఒక కమెడియన్ రష్మీని అవమానించడం హాట్ టాపిక్​గా మారింది. రీసెంట్​గా రిలీజైన ఈ షో ప్రోమోలో కమెడియన్ ఆటో రాంప్రసాద్ రష్మీని ఉద్దేశించి చేసిన డబుల్ మీనింగ్ డైలాగ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.

స్కిట్​లో భాగంగా రష్మి దగ్గరకు వెళ్లిన ఆటో రాంప్రసాద్.. రాత్రికి వస్తావా అంటూ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడారు. ‘అసలు నేనెందుకు రావాలి రాత్రికి’ అని రష్మి అడగడంతో.. ‘రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా’ అంటూ రాంప్రసాద్ సిగ్గు పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న జడ్జి ఇంద్రజ దీనిపై వెంటనే స్పందించారు. రష్మీని రాంప్రసాద్ అడుగుతుండగా ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాంప్రసాద్ ‘మా ఊళ్లో జాతర ఉంది. అందుకే పిలిచామండి’ అంటూ కవర్ చేశారు. ఇది స్కిట్​లో భాగమే అయినా రష్మీని ఉద్దేశించి ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడంపై ఆమె ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి