idream media
idream media
దాని ద్వారా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని, ఆర్థికంగా పెద్ద భారం ఉండదని, అసమానతలు వైదొలిగిపోతాయని, భవిష్యత్తులో మరోసారి ప్రాంతీయ విబేధాలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
Also Read : రాజధాని మీద ఏ కమిటీ పనిచేస్తుంది?
జగన్ ప్రకటనలో కూడా అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్ గా కొనసాగిస్తామని చెప్పారు. తద్వారా అసెంబ్లీ ని అమరావతి కేంద్రంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏటా మూడు సార్లు( బడ్జెట్ , వర్షాకాల, శీతాకాల సమావేశాల కోసం) రాష్ట్రానికి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు అమరావతి రావాల్సి ఉంటుంది. వారికి అందుబాటులో ఉండడం కోసం అధికార యంత్రాంగం కూడా అమరావతికి వస్తారు.
కార్యనిర్వాహక వ్యవస్థలో అధికార యంత్రాంగం ఉంటుంది. సెక్రటరేట్, కమిషనరేట్ వంటి వివిధ విభాగాలుంటాయి. ప్రస్తుతం ఏపీని కార్యనిర్వాహక వ్యవహారాల కోసం 13 జిల్లాలుగా విభజించారు. ఆయా జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలు ఉంటాయి.
Also Read :మూడు రాజధానులు మంచి ఆలోచన – జయప్రకాశ్ నారాయణ.
Also Read :రాజధాని – ఉత్తరాంధ్ర
అందుకు భిన్నంగా సీజన్ల వారీగా సీఎం నివాసం మారితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం జీఎన్ రావు కమిటీ రిపోర్ట్, దానిపై ప్రభుత్వ నిర్ణయమే కీలకంగా మారింది. రాజధానులు ఎన్ని ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారం అభ్యంతరం లేదు. ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో అధికార వికేంద్రకరణలో భాగంగా రాజధానుల ఏర్పాటు కనిపిస్తోంది. దాంతో ఏపీలో కూడా మూడు రాజధానుల ప్రతిపాదన విషయం చివరకు ఎటు మళ్లుతుందన్నది కీలకాంశం అవుతోంది.