iDreamPost

నా 25 ఎకరాలు రాసిస్తా.. మోదీపై అభిమానం చాటుకున్న 100 ఏళ్ల బామ్మ!

Narendra Modi: దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అయితే నార్త్ ఇండియాలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్తా ఎక్కువగా ఉంది. మోదీపై ఉండే తమ అభిమానాన్ని అనేక రకాలుగా ప్రదర్శింస్తుంటారు. తాజాగా ఓ వందేళ్ల బామ్మ కూడా మోదీపై తనకున్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకుంది.

Narendra Modi: దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అయితే నార్త్ ఇండియాలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్తా ఎక్కువగా ఉంది. మోదీపై ఉండే తమ అభిమానాన్ని అనేక రకాలుగా ప్రదర్శింస్తుంటారు. తాజాగా ఓ వందేళ్ల బామ్మ కూడా మోదీపై తనకున్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకుంది.

నా 25 ఎకరాలు రాసిస్తా.. మోదీపై అభిమానం చాటుకున్న 100 ఏళ్ల బామ్మ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లుదు. ఆయనను ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. కారణంగా ఆయన చరిష్మాతో ఇప్పటికే బీజేపీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అలానే మరోసారి కూడా కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అలానే ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై ఎంతో మంది ఎన్నో విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఓ 100 ఏళ్ల బామ్మ కూడా మోదీని తన 15వ కొడుకు అంటూ ప్రేమను చూపింది. అంతేకాక ఆమె సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అయితే నార్త్ ఇండియాలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్తా ఎక్కువగా ఉంది. అందుకే కొందరు అభిమానులు ఆయన ఫోటోను ట్యాట్యూ వేయించుకోగా, మరికొందరు అయితే ఏకంగా గుడి కట్టించారు. వయస్సుతో, కులం, మతం, లింగ బేధంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిలో మోదీకి అభిమానులు ఉన్నారు. ఎంతో మంది ఫ్యాన్స్ మోదీపై ఉండే తమ అభిమానాన్ని అనేక రకాలుగా ప్రదర్శింస్తుంటారు. తాజాగా ఏకంగా ఓ వందేళ్ల బామ్మ కూడా మోడీ మీద తనకున్న ప్రేమను చూపింది. ఆమె చేసిన కామెంట్లు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలో ఆ బామ్మ మాట్లాడుతూ మోడీని తన కొడుకుగా ప్రకటించింది.

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ గడ్ హరిపుర గ్రామానికి చెందిన మంగీభాయి అనే వందేళ్ల బామ్మ కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ఇప్పటికే 14 మంది సంతానం ఉన్నారు. అలానే ఆమెకు 25 ఎకరాల ఆస్తి ఉంది. అయితే తాజాగా ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన  15వ కుమారుడిగా ప్రకటించింది. ఆయన ఈ దేశానికి ఎంతో రక్షణగా నిలుస్తున్నాడని,  అలాంటి వ్యక్తిని త న కొడుకుగా స్వీకరిస్తాని ఆమె భావోద్వేగంగా చెప్పింది. తనకున్న 25 ఎకరాల ఆస్తిని కూడా తన 15వ కొడుకు మోదీకి రాసిస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఈ బామ్మ. అయితే నీ ఆస్తిని ఎందుకు ఇలా రాసిస్తావని మీడియా వాళ్లు అడగ్గా.. మోదీ వల్లే తాను ఈ రోజు ఇంత సంతోషంగా బతుకుతున్నానని, తనకు సొంత ఇల్లు ఇప్పించారని ఆ బామ్మ చెప్పుకొచ్చారు.

అదే విధంగా తనకు వితంతు పెన్షన్ ఇప్పిస్తున్నాడని, ఉచితంగా ఆస్పత్రిలో చూపించుకునే అవకాశం కల్పించాడని ఆమె చెప్పుకొచ్చారు. అలానే మోదీ వలన తాను తీర్థ యాత్రలకు వెళ్లగలుగుతున్నానంటూ ఎమోషనల్ అయింది. ఇప్పటి వరకు తాను ప్రధాని మోదీని చూడలేదని, తాను చనిపోయే లోపు ఆ అవకాశం వస్తే చాలా సంతోషమని ఆమె తెలిపారు. 100 ఏళ్ల బామ్మ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి