iDreamPost
android-app
ios-app

26 నుంచి వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర ప్రారంభం!

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి.

26 నుంచి వైఎస్సార్‌ సీపీ బస్సు యాత్ర ప్రారంభం!

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు త్వరలో సామాజిక సాధికార యాత్ర పేరిట ఓ బస్సు యాత్రను చేపట్టనుంది.

అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఒకేసారి బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుంచి.. కోస్తాంధ్రలోని తెనాలి నుంచి.. రాయలసీమలోని సింగనమల నుంచి బస్సు యాత్రలు ప్రారంభం అవుతాయి. బస్సు యాత్రం ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాలపై ప్రచారం చేయనున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్‌ చేసిన మేలును వివరించనున్నారు.

స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల ఆధ్వర్యంలో బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. బస్సు యాత్ర సందర్భంగా ప్రతీ మూడు ప్రదేశాల్లో ఓ సభ నిర్వహించనున్నారు. 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర సాగనుంది. ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలనుంచి తప్పకుండా మద్దతు లభించనుంది. మరి, 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ  త్వరలో చేపట్టనున్న సామాజిక సాధికార యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş