iDreamPost

విశాఖ అప్పికొండ బీచ్ రాళ్లమధ్యలో ఇరుక్కున్న యువతి! షాకింగ్ న్యూస్ ఏంటంటే?

విశాఖ అప్పికొండ బీచ్ రాళ్లమధ్యలో ఇరుక్కున్న యువతి! షాకింగ్ న్యూస్ ఏంటంటే?

విశాఖ అప్పికొండ బీచ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఆ బీచ్ రాళ్లమధ్యలో ఇరుక్కుని అపస్మారక స్థితిలో కనిపించింది. గమనించిన స్థానికులు వెంటనే ఆ యువతిని కాపాడి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ యువతిని పరిశీలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా పోలీసులకు కొన్ని ఊహించని నిజాలు తెలిశాయి. అసలు ఆ యువతి రాళ్ల మధ్యలో ఎందుకు ఇరక్కుంది? ఆమెతో పాటు బీచ్ కు వెళ్లింది ఎవరు? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడు, మచిలీపట్నానికి చెందిన ఈ జంట ఈ నెల 2 నుంచి విశాఖలోని అప్పకొండ బీచ్ లో తిరుగుతున్నారు. కాగా, పగలు బీచ్ లో తిరుగుతూ.. రాత్రి సమయాల్లో సముద్రతీరంలో ఉన్న ఓ కొండపై నిద్రిస్తున్నారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి తాజాగా అప్పికొండ బీచ్ లో అదే యువతి అపస్మారక స్థితిలో రాళ్లమధ్యలో ఇరుక్కుని కనిపించింది. స్థానికులు గమనించి అతి కష్టం మీద ఆ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి జరిగిందంతా వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో ఉన్న ఆ యువతిని పరిశీలించారు.

అయితే పోలీసుల విచారణలో మాత్రం ఊహించని నిజాలు బయటపడ్డట్లు తెలుస్తుంది. వారం రోజుల నుంచి ఈ యువతితో కలిసి తిరుగుతున్న వర్మరాజు అనే యువకుడు… తాజాగా ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు దొంగిలించి అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. దీంతో వర్మ రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు వీళ్లిద్దరు ప్రేమికులా? ఆ యువతిని వర్మరాజు హత్య చేయాలనుకున్నాడా? అసలేం జరిగిందనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి