iDreamPost

నిజం గెలవాలంటే చంద్రబాబు జీవితంలో బయటకురారు: కొడాలి నాని

ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఏపీ రాజకీయం పూర్తిగా మారింది. రాష్ట్ర పాలనకు సంబంధించిన అంశాల గురించి కాకుండా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైసీపీపై విమర్శలు చేస్తుంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని.. నిజం గెలవాలి యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలంటే చంద్రబాబు జీవితంలో బయటకురారని ఆయన మండిపడ్డారు.

ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఏపీ రాజకీయం పూర్తిగా మారింది. రాష్ట్ర పాలనకు సంబంధించిన అంశాల గురించి కాకుండా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైసీపీపై విమర్శలు చేస్తుంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని.. నిజం గెలవాలి యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలంటే చంద్రబాబు జీవితంలో బయటకురారని ఆయన మండిపడ్డారు.

నిజం గెలవాలంటే చంద్రబాబు జీవితంలో బయటకురారు: కొడాలి నాని

ఏపీలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఏపీ రాజకీయం పూర్తిగా మారింది. రాష్ట్ర పాలనకు సంబంధించిన అంశాల గురించి కాకుండా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ.. అధికార వైసీపీపై విమర్శలు చేస్తుంది. అయితే వారి విమర్శలకు వైసీపీ నేతలు సైతం ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీ నాన్నకు వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైందమ్మా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని.. నిజం గెలవాలి యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం గెలవాలంటే చంద్రబాబు జీవితంలో బయటకురారని ఆయన మండిపడ్డారు.

బుధవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వనిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాడని నాని అన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉంది. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు 2 వేల కోట్లు దాటిందని కొడాలి నాని మండిపడ్డారు.

40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు?. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ఇదే సమయంలో జనసేన, టీడీపీ కలయికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని వ్యాఖ్యనించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జన సున్నా పార్టీ పెట్టారని, లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని నాని దుయ్యబట్టారు. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడుని కొడాలి వ్యాఖ్యానించారు. మరి.. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి