iDreamPost

సంతోషం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? నవ మన్మధుడు అంటారు

నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా కాంబోలో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ సంతోషం. దశరథ్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై మంచి హిట్ అందుకుంది. నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇందులో నాగ్ కొడుకుగా నటించిన పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా కాంబోలో వచ్చిన లవ్ అండ్ ఫ్యామిలీ మూవీ సంతోషం. దశరథ్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలై మంచి హిట్ అందుకుంది. నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇందులో నాగ్ కొడుకుగా నటించిన పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

సంతోషం  చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? నవ మన్మధుడు అంటారు

2002లో వచ్చిన కుటుంబ కథా చిత్రం సంతోషం. అక్కినేని నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా, ప్రభుదేవా హీరో హీరోయిన్లుగా నటించారు. టాలెంట్ డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ పాటలు ఇప్పటికీ మనస్సును హత్తకుంటాయి. ‘నే తొలిసారిగా కలగన్నది నిన్ను కదా’, ‘దేవుడే దిగి వచ్చినా స్వర్గమే నాకిచ్చినా’, ‘డిరి డిరి డిరిడీ వారెవ్వా’, ‘నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస’ సాంగ్స్ మ్యాజిక్ చేయడమే కాకుండా..లిరిక్స్ కూడా వినసొంపుగా ఉంటాయి. ఈ సినిమాకు రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి. .

మన్మధుడు నాగ్.. ఇందులో కంప్లీట్ ఫ్యామిలీ లుక్‌లో కనిపిస్తాడు. ఓ కొడుక్కి తండ్రిగా అలరిస్తాడు. ఇందులో నాగ్ కుమారుడిగా నటించిన పిల్లాడు గుర్తున్నాడా..? బొద్దుగా, ముద్దుగా ఉండే ఈ చిన్నోడు ఇప్పుడు ఎలా అయ్యాడో తెలుసా.. ఇప్పుడు అతడో నవ మన్మధుడిగా మారాడు. లక్కీ పాత్రలో మెరిసిన ఈ బుడ్డోడు.. పెద్దోడయ్యి.. హిందీ చిత్రాల్లో అదరగొడుతున్నాడు. ఇంతకు ఈ అబ్బాయి పేరేంటంటే.. అక్షయ్ బచ్చు. తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా రెండు చిత్రాల్లోనే అలరించాడు. అందులో ఒకటి మన్మధుడు కాగా, మరోటి వర్షం. వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా, యాంకర్ సుమ కొడుకుగా అలరించాడు. కేవలం సినిమాల్లోనే కాదు ప్రకటనల్లోనూ మెరిశాడు. ఎంఎస్ ధోనీతో డాబర్ చవ్యన్ ఫ్రాష్, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్స్, క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్, నెస్లే చాకో స్టిక్, కలర్ స్కెచ్ పెన్నులు వంటి యాడ్స్ లో కనిపించాడు.

తెలుగులో రెండు చిత్రాలు చేసిన అక్షయ్.. 2005లో అంజానే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. బుల్లితెరపై కూడా పలు ధారావాహికల్లో నటించాడు ఈ బుల్లి సూపర్ స్టార్. పెద్ద వాడయ్యాక.. బ్లర్, సత్యమేవ జయతే, రుద్ర వంటి చిత్రాల్లో నటించాడు. రాస్ బరీ, ముంబయి డైరీస్ వంటి వెస్ సిరీస్‌ల్లో యాక్ట్ చేశాడు. కేవలం నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు నాట పుట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది మే 9కి ఈ సినిమా వచ్చి అప్పుడే 22 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇందులో సీనియర్ దర్శకులు విశ్వనాథ్, సునీల్, చంద్రమోహన్, బ్రహ్మానందం, సుధ, కోట శ్రీనివాసరావు, మేల్కోటే, ఎల్బీ శ్రీరామ్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి