iDreamPost

TDP చేతిలో పవన్ మోసపోవడం పక్కా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్!

  • Published May 06, 2024 | 12:02 PMUpdated May 06, 2024 | 12:02 PM

జనసేనాని పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్​పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చేతిలో పవన్ ఓడిపోవడం పక్కా అన్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్​పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చేతిలో పవన్ ఓడిపోవడం పక్కా అన్నారు.

  • Published May 06, 2024 | 12:02 PMUpdated May 06, 2024 | 12:02 PM
TDP చేతిలో పవన్ మోసపోవడం పక్కా.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్!

దేశంలో ఇప్పుడు లోక్​సభ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్​లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఏపీలో లోక్​సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. బయట ఎండల కంటే కూడా ఇక్కడ పొలిటికల్ హీటే ఎక్కువగా ఉంది. అధికార వైఎస్సార్సీపీని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్​ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి. ఈ తరుణంలో ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యూచర్​ మీద ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కల్యాణ్​ మోసపోవడం పక్కా అని వేణు స్వామి అన్నారు. ఇప్పుడే కాదు.. ఆయన ఎప్పటికీ సీఎం కాలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని.. ఈ ఎలక్షన్స్​లో టీడీపీ-జనసేన కూటమికి షాక్ తప్పదని తెలిపారు. ‘పవన్ ఓ విఫల రాజకీయ నేత అవ్వబోతున్నాడు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాడు. ఈ ఎలక్షన్స్​లో జనసేనకు షాక్ తప్పదు. టీడీపీ చేతిలో పవన్ మోసపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్​ది ఉత్తారాషాఢం మకరరాశి. వీళ్లద్దరికీ పొసగదు’ అని వేణు స్వామి స్పష్టం చేశారు.

జాతకాల రీత్యా చూసుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్​కు అస్సలు పొసగదని వేణు స్వామి పేర్కొన్నారు. వీళ్ల జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదని ఆయన తెలిపారు. పవన్​తో తనకు ఎలాంటి పంచాయితీ లేదని.. కేవలం ఆయన జాతకం ప్రకారమే జోస్యం చెబుతున్నానని వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ చేతుల్లో పవన్ మోసపోవడం పక్కా, ఆయన ఎప్పటికీ సీఎం కాలేడంటూ వేణు స్వామి చెప్పిన జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఏపీలో మళ్లీ వైసీపీ పవర్​లోకి రావడం పక్కాగా అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. జగన్​ను సీఎం అవ్వకుండా ఆపడం కష్టమేనని అంటున్నారు. మరి.. జనసేనానికి ఎన్నికల్లో షాక్ తప్పదంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి