iDreamPost

Virat Kohli: కోహ్లీ ముందు అందరూ జూజూబీ.. నిజం ఒప్పుకున్న బాబర్ ఆజం!

  • Published May 06, 2024 | 4:24 PMUpdated May 06, 2024 | 4:24 PM

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా విరాట్ ముందు అందరూ జూజూబీ అంటున్నాడు. అతడు ఇంకేం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత క్రికెట్​లో గ్రేట్ బ్యాటర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా విరాట్ ముందు అందరూ జూజూబీ అంటున్నాడు. అతడు ఇంకేం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 06, 2024 | 4:24 PMUpdated May 06, 2024 | 4:24 PM
Virat Kohli: కోహ్లీ ముందు అందరూ జూజూబీ.. నిజం ఒప్పుకున్న బాబర్ ఆజం!

క్రికెట్​లో బెస్ట్ బ్యాట్స్​మన్ ఎవరనే డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అతడు బెస్ట్ అంటే అతడు బెస్ట్ అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు, అనలిస్టులు కొంతమంది పేర్లు చెబుతుంటారు. అయితే రికార్డులు, ప్రెజర్ సిచ్యువేషన్స్​లో ఆడటం, కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం, ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే గత తరంలో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ బెస్ట్​గా నిలిచాడు. బ్రేక్ చేయలేని ఎన్నో రికార్డులు అతడి పేరు మీద ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ వారసుడిగా ఈ జనరేషన్​లో బెస్ట్ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. 15 ఏళ్లుగా అలుపెరుగని యోధుడిలా బ్యాట్​తో విజృంభిస్తూ టన్నుల కొద్దీ పరుగులు చేశాడతను. అలాంటోడితో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఆ దేశ ఫ్యాన్స్ పోలుస్తుంటారు. బాబర్ బెస్ట్ అంటూ చెత్త డిస్కషన్స్ పెడుతుంటారు.

బాబర్​ను మించినోడు లేడు.. అతడి ముందు కోహ్లీ వేస్ట్ అంటూ పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు ట్రోలింగ్​ చేశారు. అప్పుడు విరాట్ రికార్డులు, సెంచరీలతో భారత అభిమానులు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే బాబర్ అసలు నిజం ఒప్పుకున్నాడు. ప్రపంచ క్రికెట్​లో కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్​మన్ అని.. అతడ్ని మించినోడు లేడన్నాడు. విరాట్ ముందు అందరూ జూజూబీ అని తెలిపాడు. ఇంగ్లండ్​, ఐర్లాండ్ టూర్​కు వెళ్లే ముందు నిర్వహించిన ప్రెస్ మీట్​లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పాటు ఇంగ్లండ్ టీ20 సిరీస్, టీ20 వరల్డ్ కప్ గురించి కూడా ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ క్లాస్ ప్లేయర్ అని.. ప్రస్తుత క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాళ్లలో అతడు ఒకడని బాబర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. టీ20 వరల్డ్ కప్​లో విరాట్ కోసం ఏదైనా స్పెషల్ ప్లాన్ వేస్తున్నారా? అని ఆజంకు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. అవసరమైతే భారత టీమ్ మొత్తం కోసం వ్యూహం రచిస్తామని, ఏ ఒక్క ప్లేయర్ కోసం స్పెషల్ ప్లాన్ వేయబోమని స్పష్టం చేశాడు. ఒక్క ఆటగాడి కోసం ప్లాన్స్ ఉండవని, ప్రత్యర్థి జట్టులోని 11 మందిని టార్గెట్ చేసుకొని వ్యూహాలు రచిస్తేనే సత్ఫలితాలు ఉంటాయన్నాడు. అయితే భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​కు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూయార్క్​లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమన్నాడు. అక్కడి సిచ్యువేషన్స్​కు తగ్గట్లు వ్యూహాలు రచిస్తామని.. కోహ్లీ కోసం కూడా ప్లానింగ్ చేస్తామన్నాడు బాబర్. కాగా, పాక్ కెప్టెన్ కామెంట్స్ విన్న నెటిజన్స్ తన కంటే కోహ్లీనే గొప్ప అని అతడు ఒప్పుకున్నాడని.. ఇక నో మోర్ డిస్కషన్స్ అని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి