iDreamPost

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ కన్నీరు! ఇంత దారుణంగా ఏడ్చేయడం ఇదే తొలిసారి!

  • Published May 06, 2024 | 4:22 PMUpdated May 06, 2024 | 4:22 PM

ప్రతి వీకెండ్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో  తమదైన డ్యాన్స్ లతో, స్కిట్ లతో ప్రేక్షకులను అలరించిన పాపులార్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. అయితే ఈ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ ఎప్పుడు కమెడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ.. తనదైన పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఎంతో సరదాగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా ఆ షోలో కంటెస్టెంట్స్ వలన ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయింది.

ప్రతి వీకెండ్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో  తమదైన డ్యాన్స్ లతో, స్కిట్ లతో ప్రేక్షకులను అలరించిన పాపులార్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. అయితే ఈ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ ఎప్పుడు కమెడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ.. తనదైన పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఎంతో సరదాగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా ఆ షోలో కంటెస్టెంట్స్ వలన ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయింది.

  • Published May 06, 2024 | 4:22 PMUpdated May 06, 2024 | 4:22 PM
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇంద్రజ కన్నీరు! ఇంత దారుణంగా ఏడ్చేయడం ఇదే తొలిసారి!

సినీనటి ఇంద్రజ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగునాట ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో అలరించి మంచి గుర్తుంపును తెచ్చుకున్న నటి ఇంద్రజ. అంతేకాకుండా.. తన ఆద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షల హృ‌దయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇక వివాహం అనంతరం ఇంద్రజ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిదే. కాగా, ఈ మధ్యనే ఇంద్రజ తన టాలెంట్ ను నిరుపించుకోవడానికి ఇండస్ట్రీలో రి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో అలరిస్తూ.. ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మరోవైపు పలు బుల్లితెర షోస్ అయితన జబర్దస్త్, , శ్రీదేవి డ్రామా కంపెనిలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల్లో ఇంద్రజకు రాని గుర్తింపు ఎక్కువగా బుల్లితెర షోలలో వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఈమె అందం, ఆకర్షించే నవ్వు మాటలతో అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే కమెడియన్స్ తో కూడా ఇంద్రజ బాగా ఇంటరాక్ట్ అవుతూ.. తనదైన పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తుంది. అయితే ఎంతో సరదాగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రతి వీకెండ్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో  తమదైన డ్యాన్స్ లతో, స్కిట్ లతో ప్రేక్షకులను అలరించిన పాపులార్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. కాగా,  కామెడీ షోలకి జడ్జ్ గా ఇంద్రజ  వ్యవహరిస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే ఆ షోలో బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ వంటి ఆర్టిస్టులతో.. ఆమె కూడా కలిసిపోయి తనదైన కామెడీతో పంచ్ లు వేస్తూ  ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు ఇంద్రజ. కానీ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ఇంద్రజ.. లేటెస్ట్ గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకు కారణం మే 12వ తేదీన మదర్స్ డే సందర్భంగా.. మదర్స్ డే స్పెషల్ టీం తో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోని రూపొందించారు. అయితే దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఈ మధ్యనే విడుదలైంది. ఇక ఆ ప్రోమో మొదట్లో అంతా సరదా సరదాగా సాగిన ఆ తర్వాత మాత్రం  పూర్తి ఎమోషనల్ గా మారిపోయింది.

Indraja

కాగా, ఆ ప్రోమోలో ఫైమా, అంజలి తదితరులు వారి తల్లులతో ఈ షోకి హాజరయ్యారు. ఇక గెటప్ శ్రీను కూడా తాను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ సినిమా ప్రమోషన్స్ కి ఈ ఎపిసోడ్ లో కనిపించారు. అయితే అందులో రష్మీ మమ్మీ వర్సెస్ డాటర్స్ అంటూ ఒక గేమ్ ని నిర్వహించింది. అంతేకాకుండా.. ఆ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుల్, నూకరాజు, పొట్టి నరేష్, వంటి కమెడియన్లు తాము అమ్మగా భావించే ఇంద్రజని సన్మానించారు. ఈ క్రమంలోనే .. ఆమెకు ఒక్కొక్కళ్ళు ఒక్కో గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇక నూకరాజు అయితే ఆమెకు ఒక మంచి చీరని గిఫ్ట్ చేశారు.  అయితే వారందరూ చూపించే ప్రేమను చూసి ఇంద్రజ చాలా ఎమోషనల్ అయిపోయారు. పైగా తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే.. జీవితంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని రిలేషన్ షిప్స్ ఉన్నా తల్లి, తండ్రి లేకపోతే అనాధలమే అవుతాం అని ఇంద్రజ కంటతడి పెట్టుకున్నారు. మరి, నటి ఇంద్రజ శ్రీదేవి డ్రామ కంపెనీ షోలో తన తల్లి విషయంలో ఎమోషనల్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి