iDreamPost

దారుణం: కన్న తల్లిని బెదిరించి అత్యాచారం చేసిన కొడుకు!

దారుణం: కన్న తల్లిని బెదిరించి అత్యాచారం చేసిన కొడుకు!

సమాజంలో దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్పా తగ్గడం లేదు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఘోరాలు మాత్రం ఆగడం లేదు. కొందరైతే వావివరసలు మరిచి కన్న వాళ్లను, కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగాల్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు కన్న తల్లిని బెదిరించి మూడు సార్లు అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లోని హరిదేవ్ పూర్ లో 65 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారుల సంతానం. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో తల్లికి దూరంగా కాపురం పెట్టాడు. చిన్న కొడుకు (33) మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడు. ఇతడు మద్యానికి బానిసై చెడు తిరుగుళ్లు తిరుగుతుండేవాడు. ఇదిలా ఉంటే.. గత నాలుగేళ్ల కిందట తల్లిని బెదిరించి చిన్న కుమారుడు రెండు సార్లు అత్యాచారం చేశాడు. కొడుకు దారుణాన్ని ఎవరికి చెప్పుకోలేక ఆ తల్లి తనలో తాను కుమిలిపోతూ బతికింది. ఇక ఈ క్రమంలోనే ఈ కామాంధుడు ఇటీవల మరోసారి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఇక భరించలేకపోయిన ఆ మహిళ.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఇక చుట్టు పక్కల వ్యక్తులు సైతం న్యాయస్థానంలో సాక్షం చెప్పడంతో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. కొడుకు మద్యానికి బానిసై తల్లిని బెదిరించి అత్యాచారం చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి