iDreamPost

వాల్తేరు వీరయ్య నటుడు బాబీ సింహకు బెదిరింపులు!

వాల్తేరు వీరయ్య నటుడు బాబీ సింహకు బెదిరింపులు!

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో విలన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న నటుడు బాబీ సింహ. ఇతను తెలుగువాడైన తమిళ్ సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక బాబీ సింహ చాలా కాలం నుంచి ఇక్కడే స్థిరపడి చెన్నైలోని కొడైకెనాల్ లో ఓ ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. అయితే తాజాగా బాబీ సింహకు స్నేహితుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై బాబీ సింహ తాజాగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

నటుడు బాబీ సింహ చెన్నైలోని స్థిరపడడంతో ఇక్కడే ఓ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే తమిళనాడు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉసేన్ అనే వ్యక్తి బాబీ సింహకు స్నేహితుడు. అయితే ఉసేన్ జమీర్ అనే బిల్డింగ్ కాంట్రాక్టర్ తో ఇల్లు నిర్మాణానికి కోటి 30 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇల్లు పూర్తి చేయకపోగా, మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఉసేన్, జమీర్ కలిసి నటుడు బాబీ సింహను ఇవ్వాలని కోరారు.

దీంతో విసుగు చెందిన బాబీ సింహ.. నాకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చివరికి పోలీసులు కూడా బాబీ సింహకు న్యాయం చేయనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉసేన్, జమీర్ ఇద్దరు నటుడు బాబీ సింహకు ఎదరు తిరిగారు. ఈ విషమంపై బాబీ సింహ వెంటనే కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ జమీర్, అతని స్నేహితుడైన ఉసేన్ ఇద్దరి నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయిని బాబీ సింహ వివరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి