iDreamPost

దంపతుల ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

దంపతుల ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

విశాఖ కొమ్మాదిలో ఉన్న శివశక్తికాలనీలో ఎంవీకే ప్రసాద్‌ (54), రాజరాజేశ్వరి (50) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొంత కాలంగా స్మార్ట్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఉన్న ఓ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్నారు. కాగా, ఈ దంపతులు ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికంగా ఉన్న ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ చూపారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.20 నుంచి 25 వేల వరకు వసూలు చేశారు.

అలా కొన్నిరోజులు గడిచింది. డబ్బులు చెల్లించిన ఆ నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో వాళ్లంతా ఎంవీకే ప్రసాద్‌, రాజరాజేశ్వరి దంపతులను ఆశ్రయించారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక ఈ రోజు, రేపు అంటూ రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ, వారికి ఉద్యోగాలు మాత్రం కల్పించలేదు. దీంతో విసుగు చెందిన డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు.. ఈ దంపతులను గట్టిగా ప్రశ్నించారు. ఇక వీరి ఒత్తిడికి ఆ దంపతులకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు.

ఇక చేసేదేం లేక ఈ దంపతులు తాజాగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దంపతుల మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఆత్మహత్య చేసుకున్న ఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దారుణం: అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దండగులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి