iDreamPost

పంత్ కోసం కోహ్లీ ఆ త్యాగం చేయాలి.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Jun 14, 2024 | 9:43 PMUpdated Jun 14, 2024 | 9:43 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ భారత మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు. పంత్ కోసం కింగ్ త్యాగం చేయాలని అన్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ భారత మాజీ క్రికెటర్ ఒక సలహా ఇచ్చాడు. పంత్ కోసం కింగ్ త్యాగం చేయాలని అన్నాడు.

  • Published Jun 14, 2024 | 9:43 PMUpdated Jun 14, 2024 | 9:43 PM
పంత్ కోసం కోహ్లీ ఆ త్యాగం చేయాలి.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024లో రోహిత్ సేన అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా.. ఇంకో మ్యాచ్ ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. దీంతో కెనడాతో జరిగే లాస్ట్ లీగ్ మ్యాచ్ నామమాత్రం కానుంది. గత మూడు మ్యాచుల్లోనూ బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించింది. అయితే బుమ్రా, అర్ష్​దీప్, హార్దిక్ పాండ్యా సహా ఇతర బౌలర్లు రఫ్ఫాడించడంతో జట్టుకు ఎదురు లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధిస్తున్నా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. కింగ్ తిరిగి ఫామ్​ను అందుకుంటాడా? లేదా? అనేది అందర్నీ టెన్షన్​ పెడుతోంది. మున్ముందు సూపర్-8తో పాటు నాకౌట్ స్టేజ్ కూడా ఉండటంతో కోహ్లీ ఎలా ఆడతానేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ విషయంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు.

కోహ్లీ త్వరగా గాడిన పడాల్సిన అవసరం ఉందన్నాడు శ్రీశాంత్. అతడు ఫామ్​ను అందిపుచ్చుకుంటే టీమిండియాకు తిరుగుండదన్నాడు. అయితే పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కోసం విరాట్ త్యాగం చేయాల్సిన సమయం వచ్చేసిందన్నాడు. కోహ్లీ ఓపెనింగ్ నుంచి మూడో పొజిషన్​కు మారాలని సూచించాడు. అవసరమైతే పంత్​ను మరింత టాప్​లో ఆడించాలని, అందుకోసం కింగ్ తన ప్లేస్​ను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలిపాడు. ‘రిషబ్ పంత్ సిచ్యువేషన్స్​కు తగ్గట్లు తన ఆటతీరును మార్చుకుంటాడు. అతడు డిఫరెంట్ పొజిషన్స్​లో బ్యాటింగ్ చేయడం చూశాం. కోహ్లీ మూడో స్థానంలో ఆడితే పంత్ ఇంకా సంతోషిస్తాడు. పరిస్థితుల్ని, బౌలర్​ను, పిచ్​ను పట్టించుకోకుండా ధనాధన్ క్రికెట్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

పంత్​ బాల్ వచ్చిందే తడవు బాదేస్తాడని.. అదే అతడి శైలి అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. బాల్​ వచ్చిందా కొట్టడం మాత్రమే అతడికి తెలుసునని, మిగతా విషయాలేవీ పట్టించుకోడని వ్యాఖ్యానించాడు. పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ ఆటతీరు మీద కూడా శ్రీశాంత్ రియాక్ట్ అయ్యాడు. అతడు పార్ట్ టైమర్​లా కాకుండా మెయిన్ పేసర్​ లెవల్​లో బౌలింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. కట్టర్స్​తో పాటు స్లో బౌన్సర్స్ వేస్తున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు శ్రీశాంత్. ఆస్ట్రేలియా జట్టులో మార్కస్ స్టొయినిస్ పోషిస్తున్న పాత్రే.. టీమిండియాలో హార్దిక్ పోషిస్తున్నాడని స్పష్టం చేశాడు. బౌలింగ్ ఆల్​రౌండర్​ ఇలా కీలక సమయాల్లో వికెట్లు తీయడం జట్టుకు ఎంతో ముఖ్యమని శ్రీశాంత్ వివరించాడు. పాండ్యా ఇలాగే ఆడితే భారత్​కు తిరుగుండదని, అతడు మున్ముందు టీమ్​కు మరింత ఇంపార్టెంట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. మరి.. పంత్ కోసం కోహ్లీ త్యాగం చేయాలంటూ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి