Nidhan
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు పరువును నిలబెట్టారు. ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విలువ ఏంటో మరోమారు చాటారు.
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు పరువును నిలబెట్టారు. ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా మారిన ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విలువ ఏంటో మరోమారు చాటారు.
Nidhan
ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ క్రికెటర్లు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేర్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ భారత ప్లేయర్లు తమ బ్యాటింగ్ టాలెంట్తో జెంటిల్మన్ గేమ్ను శాసిస్తున్నారు. హిట్మ్యాన్ అటు బ్యాటింగ్తో పాటు ఇటు అద్భుతమైన కెప్టెన్సీతోనూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. గతేడాది అతడి సారథ్యంలో ఆసియా కప్ గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచింది. టెస్టుల్లోనూ రోకో (రోహిత్-కోహ్లీ) జోడీ అదరగొడుతున్నారు. ముఖ్యంగా విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రీసెంట్గా జరిగిన సౌతాఫ్రికా టూర్లోనూ కోహ్లీ తన బ్యాట్ పవర్ చూపించాడు. ఆ సిరీస్లో అతడనొక్కడే రాణించాడు. ప్రొటీస్తో టెస్టుల్లో రోహిత్ ఫర్వాలేదనిపించాడు. కానీ యంగ్స్టర్స్ అందరూ ఫెయిలయ్యారు. దీంతో కుర్రాళ్లను నమ్ముకుంటే కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తాజాగా విడుదలైన టెస్ట్ ర్యాంకింగ్స్ కూడా ఊతమిస్తోంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (864 పాయింట్లు) ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (859), ఆసీస్ సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (818) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఇద్దరు క్రికెటర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (775) ఆరో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ (748) పదో పొజిషన్లో ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్ గురించి తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ భారత్ పరువు నిలిపారని అంటున్నారు. యువ ఆటగాళ్లను నమ్ముకుంటే టీమిండియా పరిస్థితి గోవిందా అని కామెంట్స్ చేస్తున్నారు. రోకో జోడీ ఉన్నన్ని రోజులే క్రికెట్లో మన డామినేషనల్ అని చెబుతున్నారు.
వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో శుబ్మన్ గిల్ కొనసాగుతుండగా.. టాప్-10లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. గిల్ కూడా 50 ఓవర్ల ఫార్మాట్ తప్పితే టీ20లు, టెస్టుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. రీసెంట్గా ముగిసిన సౌతాఫ్రికా టూర్లోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. టెస్టుల్లోనైతే ఆడితే రోహిత్ లేదంటే కోహ్లీనే అనేలా ఉంది పరిస్థితి. దీని వల్లే ర్యాంకింగ్స్లో భారత్కు ఆ దుస్థితి ఎదురవుతోంది. శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ ఇకనైనా ఫెయిల్యూర్ నుంచి బయటపడాలి. త్వరలో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ స్వదేశంలో జరగనున్నప్పటికీ క్వాలిటీ పేస్ అటాక్ కలిగిన ఇంగ్లీష్ టీమ్ను నిలువరించి వీళ్లు రన్స్ చేయాలి. అప్పుడే సిరీస్ దక్కడంతో పాటు ర్యాంకింగ్స్లోనూ మెరుగవుతారు. అలాగే ఫ్యూచర్పై మరింత భరోసా కలుగుతుంది. మరి.. టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా క్రికెటర్లు వెనుకంజలో ఉండటం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: హైదరాబాద్లో BCCI ఫంక్షన్.. సందడి చేయనున్న టీమిండియా, ఇంగ్లండ్ ప్లేయర్లు!
The newly updated ICC Test rankings display notable movements:
▶️ Kane Williamson maintains his position as the top-ranked Test batter.
▶️ Rohit Sharma secures a spot in the top 10 of the latest Test batting rankings.
▶️ Joining the top 10 in the latest Test bowling rankings is… pic.twitter.com/PFSlQMlQZ9— CricTracker (@Cricketracker) January 10, 2024