iDreamPost

షూటింగ్‌లో గాయపడ్డ విజయ్‌ దేవరకొండ సమంత వార్తలపై దర్శకుడి స్పందన

షూటింగ్‌లో గాయపడ్డ విజయ్‌ దేవరకొండ సమంత వార్తలపై దర్శకుడి స్పందన

అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అటు విజయ్ తో ఇటు శివ నిర్వాణ తో కలిసి సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సమయంలో విజయ్, సమంతకు గాయాలయ్యాయని, వెంటనే వీరిద్దదరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

అయితే.. అందులో నిజం లేదని, ఇదంతా ఫేక్ న్యూస్ అని విజయ్ దేవరకొండ పీఆర్ తెలిపారు. మరికొద్దిసేపట్లో ఈ ఘటనపై చిత్రబృందం స్పష్టత ఇస్తుందని ఆయన వెల్లడించారు. పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలొచ్చాయి. లిడర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడుపుతూ షూటింగ్ చేస్తుండగా.. వాహనం నీటిలో పడటంతో విజయ్, సమంతలు గాయపడినట్లు వార్తా వెబ్ సైట్లు రాసుకొచ్చాయి.

కానీ.. ఇదంతా ఫేక్ అని తేలిపోయింది. విజయ్ దేవరకొండ, సమంతలకు షూటింగ్ సమయంలో ఎలాంటి గాయాలు కాలేదని, వారిద్దరూ క్షేమంగానే ఉన్నారని విజయ్ దేవరకొండ పీఆర్ తెలిపారు. కాగా.. కశ్మీర్ లో ఖుషి షూటింగ్ షెడ్యూల్ పూర్తైనట్లు దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్లో తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 23న ఖుషి విడుదల కానుంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఈ ఏడాదే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పూరీ డైరెక్షన్లో నటించనున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి