iDreamPost

విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్‌పై దాడి.. బీర్‌ బాటిల్‌తో పొడిచి

  • Published Nov 25, 2023 | 9:49 AMUpdated Nov 25, 2023 | 9:49 AM

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న దుండగుడు ఒకడు.. దుర్గ గుడి చైర్మన్‌పై దాడి చేశాడు. ఆ వివరాలు..

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న దుండగుడు ఒకడు.. దుర్గ గుడి చైర్మన్‌పై దాడి చేశాడు. ఆ వివరాలు..

  • Published Nov 25, 2023 | 9:49 AMUpdated Nov 25, 2023 | 9:49 AM
విజయవాడ దుర్గ గుడి ఛైర్మన్‌పై దాడి.. బీర్‌ బాటిల్‌తో పొడిచి

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. పోలీసులు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా సరే.. సమాజంలో నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఈమధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం పెరగడమే నేరాలకు ప్రధాన కారణం అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగుడు ఒకడు దుర్గగడి ఛైర్మన్‌పై బీర్‌ బాటిల్‌తో దాడి చేశాడు. ఆ వివరాలు..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌ కర్నాటి రాంబాబుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మద్యం మత్తులో ఉన్న దుండుగుడు రాంబాబుపై బీర్ బాటిల్‌తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో రాంబాబు పొట్ట భాగంలో తీవ్ర గాయమైనట్లు సమాచారం. దాడి జరుగుతున్న సమయంలో రాంబాబు వెంట ఆయన బంధువులు దుండగున్ని అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన రాంబాబును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నారు. రాంబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు. ద

అయితే.. రాంబాబు తండ్రి ఈ మధ్యే మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి తండ్రి సమాధి వద్ద దీపం పెట్టి తిరిగి వస్తున్నారు. అదేసమయంలో ఓ దుండగుడు ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి రాంబాబుపై దాడికి పాల్పడ్డాడు. అయితే.. దాడిని పసిగట్టిన రాంబాబు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుని చేతిలో ఉన్న బీర్ బాటిల్ రాంబాబు పొట్టలో గుచ్చుకుంది. ఆయన వెంట ఉన్న ఉన్న బంధువులు ఆ నిందితున్ని అడ్డుకుని.. పట్టుకున్నారు. రక్తస్రావం అవుతున్న రాంబాబును వెంటనే ఆసుపత్రికి తరలించారు.

దాడి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. రాంబాబుపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనకు సంబంధించి విజయవాడ కమిషనర్‌.. రాంబాబుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ దుండగుడు ఎవరు.. రాంబాబుపై ఎందుకు దాడి చేశాడు.. అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి