iDreamPost

ఆంధ్రజ్యోతి పై 100 కోట్ల దావా – టిటిడి బోర్డు నిర్ణయం

ఆంధ్రజ్యోతి పై 100 కోట్ల దావా – టిటిడి బోర్డు నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ట దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయాలని
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టిటిడి) నిర్ణయించింది. అలాగే రమణ దీక్షితులును ఆలయ ప్రధాన అర్చకుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియా తో మాట్లాడారు. 2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ.1285 కోట్లు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు. పాలక మండలి నిర్ణయాలను వెల్లడించారు.

– 2019-20 వార్షిక బడ్జెట్‌ కింద రూ. 3243 కోట్లకు పాలకమండలి ఆమోదం

– ఘాట్‌ రోడ్డు మరమ్మత్తుల కోసం రూ.10 కోట్లు.

– టీటీడీ పరిపాలనా భవనం మరమత్తుల కోసం రూ.14.30 కోట్లు

– ఘాట్‌రోడ్డు భద్రతా ప్రమాణాల పరిశీలకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం

– రూ.14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం.

– జమ్ముకశ్మీర్‌, వారణాసిలోనూ ఆలయాలు నిర్శాణం.

– టీటీడీ ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు

– సోషల్‌ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి