iDreamPost

ఇంజనీరింగ్ విదార్థిని షాకింగ్ డెసిషన్ .. హాస్టల్ ఎవరూ లేని సమయంలో..!

ఈ యువతి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ చదువుతోంది. అయితే, ఈ విద్యార్థిని ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో అంతా షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

ఈ యువతి ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ చదువుతోంది. అయితే, ఈ విద్యార్థిని ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో అంతా షాక్ కు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

ఇంజనీరింగ్ విదార్థిని షాకింగ్ డెసిషన్ .. హాస్టల్ ఎవరూ లేని సమయంలో..!

సమస్యలు మనుషులకే వస్తాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ, ఇలా ఆలోచించకుండా కొందరు ఇక అంతా పోయిందన్నట్లుగా ఉన్నట్టుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు కూడా ప్రతీ చిన్న విషయానికి నిరుత్సాహ పడుతున్నారు. ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావేమోనని భావించి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. అయితే, అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకుంది. హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో చేయాలనుకున్న పని చేసింది. ఈ ఘటనతో ఆ యువతి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ విద్యార్థి ఏం చేసింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ విద్యార్థిని పట్టణంలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. రోజూ క్లాసులకు వెళ్తూ తన స్నేహితులతో సంతోషంగానే ఉండేది. ఇదిలా ఉంటే.. ఉన్నట్టుండి ఈ విద్యార్థిని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఆదివారం అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో బాత్ రూమ్ లోకి వెళ్లింది. ఆ తర్వాత తెచ్చుకున్న హెయిర్ లోషన్ తాగింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే సమయంలో నిద్రలేచిన తోటి స్నేహితులు ఇదంతా గమనించారు. వార్డెన్ కు తెలియజేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం హాస్టల్ సిబ్బంది సాయంతో ఆ విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆ యువతికి చికిత్స అందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి వచ్చారు.

ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆ యువతి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణవార్త తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం యువతి మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఉన్నట్టుండి ఈ అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. అయితే, ఒత్తిడికి గురై ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ యువతి ఆత్మహత్యపై కొందరు స్పందించి.. ఇలా ప్రతీ చిన్న విషయానికి బలవన్మరణానికి పాల్పడకూడదని, సమస్యలు ఏంటో స్నేహితులకు, తల్లిదండ్రులకు చెప్పి పరిష్కారం దిశగా ఆలోచించాలే తప్పా.. ఇలా పిరికివారిలో ఆత్మహత్య చేసుకోవద్దంటూ సూచిస్తున్నారు. ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న యువతి నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి