iDreamPost

విషాదం : ఆడుకుంటున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

విషాదం : ఆడుకుంటున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

హైదరాబాద్ లోని సనత్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై కొందరు యువకులు కారు ఎక్కించారు. నిందితులు ఓవర్ స్పీడ్ తో కారు నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారుని గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే చిన్నారి ప్రాణాలు తీసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి