iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన జీపు..

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన జీపు..

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.  ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలానే మరెందరో తీవ్ర గాయాలతో నరకవేదన అనుభవిస్తున్నారు. తాజాగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు… అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళ రాష్ట్రంలోని వయానాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వయానాడ్ జిల్లాలోని  తవింహళ్ గ్రామ పంచాయితీ వద్ద ఓ జీపు ప్రమాదానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం తివింహళ్ ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి..లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ముగ్గురి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. జీపు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులందరు స్థానికంగా మొక్కలకు సంబంధించిన పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ పనుల్లో భాగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నట్లు సమచారం. గాయపడిన వారికి స్థానికం ఆస్పత్రిలో చికిత్స అందించారు. అలానే మృతదేహాలను మనంతవాడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు చేర్చారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జీపు లోయలో పడి పోవడంతో నుజ్జు నుజ్జుగా మారిపోయింది. మరి.. ఇలాంటి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి