iDreamPost
android-app
ios-app

జోరు వానలో నడిరోడ్డుపై కూర్చున్న వ్యక్తి! తగిన బుద్ధి చెప్పిన లారీ డ్రైవర్!

  • Published Sep 01, 2024 | 12:23 PM Updated Updated Sep 01, 2024 | 12:23 PM

Heavy Rains: ఈ ఏడాది చాలా దారుణంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం బాధ్యత లేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.

Heavy Rains: ఈ ఏడాది చాలా దారుణంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం బాధ్యత లేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.

జోరు వానలో నడిరోడ్డుపై కూర్చున్న వ్యక్తి! తగిన బుద్ధి చెప్పిన లారీ డ్రైవర్!

 

భగ భగ మండే ఎండా కాలం అయిపోయాక వర్షా కాలం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాది ఇంకా చాలా దారుణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆగకుండా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. నగరాల్లో ఎక్కడ చూసినా వాన నీరు వరదలై నదుల్లా పారుతుంది. రోడ్లు అన్ని వర్షపు నీళ్లతో నిండిపోయాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేక చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పల్లె టూర్లలో నివసించే ప్రజలు ఇంకా సతమతం అవుతున్నారు. ఈ వానల వలన రైతుల పంటలు పాడైపోతున్నాయి. వర్షాలు చాలా తీవ్రం కావడంతో అధికారులు బయటకి రావద్దని ప్రజల్ని సూచిస్తున్నారు.

కానీ కొంతమంది మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి జోరుగా వాన పడుతున్నా కానీ నడి రోడ్డు పైకి వచ్చి ఓ పిచ్చి పని చేసాడు. భారీ వాహనాలు తిరిగే నడి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకొని దర్జాగా కూర్చున్నాడు. ఆ రోడ్డుపై వాహనాలు వెళుతున్నా కూడా ఏమాత్రం భయం, బాధ్యత లేకుండా కూర్చున్నాడు. దీంతో అతను చేసిన ఆ పిచ్చి పనికి ఓ లారు డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు. నది రోడ్డు మధ్యలో కూర్చున్న ఆ వ్యక్తికి కొంచెం తగిలే విధంగా లారీని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. ఆ లారీ ఆ వ్యక్తికి కొంచెం తగలడంతో కూర్చున్న చోటే పక్కకి బొక్క బోర్లా పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లారీ డ్రైవర్ ఆ వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş