Khammam Road Accident: పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు! కానీ, ఏం లాభం!

పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు! కానీ, ఏం లాభం!

ఇతని పేరు రాజేష్, వయసు 26 ఏళ్లు. స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఇతడిని ప్రేమించింది. అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, పెళ్లికి మొదట్లో వీరి పెద్దలు అంగీకరించలేదు. ఇక పట్టుబట్టి మొత్తానికి పెద్దలను ఒప్పించి ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాజేష్ భార్య, అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామం. ఇక్కడే రాజేష్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఓ పార్టీ జిల్లా కార్యాలయంలో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రాజేష్ గతంలో కావ్య అనే యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, మొదట్లో ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మొత్తానికి ఇరువురి పెద్దలను ఒప్పించి రాజేష్ మూడేళ్ల కిందట ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన రెండేళ్లకు వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే? రాజేష్ ఎప్పటిలాగే మంగళవారం బైక్ పై ఖమ్మం బయలు దేరాడు. అతని బైక్ కొండాపూర్-అరేంపుల గ్రామల మధ్యకు ఎదురుగా వస్తున్న ఓ కారు రాజేష్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు మార్గమధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ భార్య, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. రాజేష్ మరణంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments