iDreamPost
android-app
ios-app

పెంచడం చేతకాకపోతే ఇలాంటి కొడుకును కనొద్దు.. కరీంనగర్ యువతి పోస్ట్ వైరల్

  • Published Aug 10, 2024 | 3:41 PM Updated Updated Aug 10, 2024 | 3:41 PM

కరీంనగర్ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో యువతి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆ యువతి తన సెల్ ఫోన్ లో ప్రియుడు భరత్ తల్లిదండ్రులకను ఉద్దేశించి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది.

కరీంనగర్ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో యువతి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆ యువతి తన సెల్ ఫోన్ లో ప్రియుడు భరత్ తల్లిదండ్రులకను ఉద్దేశించి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది.

  • Published Aug 10, 2024 | 3:41 PMUpdated Aug 10, 2024 | 3:41 PM
పెంచడం చేతకాకపోతే ఇలాంటి కొడుకును కనొద్దు.. కరీంనగర్ యువతి పోస్ట్ వైరల్

తాజాగా ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో యువతి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బాధిత యువతి కరీంనగర్ లోని పెద్దపల్లి జిల్లా తిమ్మాపూర్ మండం పోరండ్లకు చెందిన మామిడి మొగిళి అనే వక్తి చిన్న కూతురు అఖిల(20). అయితే ఈమె ఇంటి వద్ద ఉంటునే ఎం.ఎల్.టీ చదువుతోంది. ఈ క్రమంలోనే ఇన్ స్టా గ్రాంలో పరిచయమైన భరత్ అనే యువకుడిని ప్రేమిచింది. తనతోనే జీవితమనుకుంటూ.. సర్వం అర్పించింది.

కానీ, ఆ యువకుడు మాత్రం ప్రేమ పేరుతో అఖిలని మోసం చేశాడు. శారీరకంగా వాడుకున్నాడు. దీంతో ఈ మోసాన్ని తట్టుకోలేని యువతి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి ఉరివేసుకుని నిండ్రు ప్రాణాలను తీసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని నింపింది. అయితే అఖిల చనిపోయే ముందు తన సెల్ ఫోన్ లో ప్రియుడు భరత్ తల్లిదండ్రులకను ఉద్దేశించి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

కరీంనగర్ జిల్లాలో ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేని అఖిల అనే యువతి.. అర్ధంతరంగా తన జీవితానికి ముగింపు పలుకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా.. ఆ  ఆత్మహత్య చేసుకునే ముందు తన ప్రియుడు తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఓ పెద్ద సారంశంను పంపింది. ఇక అందులో అఖిల.. నేను చాలా సెన్సిటివ్, ఓవర్ లవ్, ఓవర్ కేర్,ఓవర్ పొసెసివ్ కూడా.. చాలా ఓవర్ గా థింక్ చేస్తా అని డే వన్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. కానీ, పెళ్లి చేసుకొని నీతో ఉంటా అని ప్రామిస్ చేసి నన్ను ఫిజికల్ గా వాడుకున్నాడు. నా చావుకి కారణం అమగోత్ భరత్.  అది మీకు చెప్పినా కూడా కొంచెం కూడా ఏమాత్రం స్పందించలేదు. అందరూ కలిసి నా బతుకు ఆగం చేశారు. నా చావుకు కారణం అయ్యారు.

నా ఇంట్లో  ఎప్పటికీ తీరలేని బాధ మిగిల్చారు. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు . నేను పడిన బాధ మీకు తెలుస్తుంది . మీవల్ల మా వాళ్లు పడిన బాధ మొత్తం మీరు కూడా ఒకరోజు అనుభవిస్తారు . పేరెంట్స్ మీరే పట్టించుకోకుండా.. అలా గాలికి వదిలేస్తే నాలాంటి వాళ్లు ఇలానే చావాల్సి వస్తుంది. ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు. ఎంత వేస్ట్ గాడు అయినా కూడా పోనీ పోనీ అనుకొని ఫర్గివ్ చేసా! లాస్ట్కి నన్నే “చావు.. ఏం కాదు మాకు” అని మాట్లాడాడు  నీ కొడుకు. నాతో తిరిగింది, నాతో తిన్నది, నాతో చేసినవి అన్నీ కళ్ళకి కనిపించకుండా పోయాయి. పెంచడం చేతకాకపోతే ఇలాంటి కొడుకును కనొద్దు . మీ వల్ల బంగారం లాంటి నా ఫ్యామిలీలో రిమార్క్ పడిపోయింది. మీ ఇంట్లో కూడా ఏ తప్పు చేయకుండా ఒకరు నాలాగా చచ్చిపోతే తెలుస్తుంది మీకు. ఇలాంటి పాపపోనికి పోనీలే అని వందల ఛాన్స్లు ఇచ్చాను. లవ్ చేసా కదా అని వెనుక వేసుకుని వస్తే.. చివరికి నా చావుకే కారణం అయ్యాడు. సిగ్గు లేకుండా ఎలా  బ్రతుకుతారో నా ప్రాణం తిని ఛీ…! అంటూ అఖిల రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.