iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు!

  • Published Aug 07, 2024 | 4:23 PM Updated Updated Aug 07, 2024 | 4:23 PM

IMD Hyderabad: కొన్ని రోజుల నుంచి  హైదరాబాద్ తో సహా తెలంగాణలోని  పలు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.   ఈ క్రమంలోనే నగర వాసులకు వానలకు సంబంధించిన కీలక అలెర్ట్ వచ్చింది.

IMD Hyderabad: కొన్ని రోజుల నుంచి  హైదరాబాద్ తో సహా తెలంగాణలోని  పలు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.   ఈ క్రమంలోనే నగర వాసులకు వానలకు సంబంధించిన కీలక అలెర్ట్ వచ్చింది.

  • Published Aug 07, 2024 | 4:23 PMUpdated Aug 07, 2024 | 4:23 PM
హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్.. రానున్న మూడు రోజుల్లో వర్షాలు!

గతకొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఉత్తరాదిన మొదలకుని, దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు విజృభిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో వానలు కుండపోతగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో తేలిక నుంచి భారీ వానలు కురిశాయి. ముఖ్యం తెలంగాణ రాష్ట్రంలో అయితే వానలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వానలకు భాగ్యనగరం జలమయం అయ్యింది. ఈ వానకు నగర ప్రజలు ఎంతో నరకం చూశారు. ఇది ఇలాంటే తాజాగా హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలెర్జ్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో నగరంలో వానలు కురవనున్నాయి.

కొన్ని రోజుల నుంచి  హైదరాబాద్ తో సహా తెలంగాణలోని  పలు జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  ఇక నగరంలోని పలు చెరువులు అయితే నిండు కుండల్లా నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులు విరామం ఇచ్చిన వాన..మళ్లీ ప్రారంభంమైంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక నగర వాసులకు కీలక అలెర్ట్ జారీ చేసింది.

Rains in HYD for next 3 days!

రానున్న మూడు రోజులు అంటే…గురు, శుక్ర, శనివారంలో నగరంలో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.  హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో నిర్మల్‌ జిల్లా బాసరలో అత్యధికంగా 4.08 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అలానే మరికొన్ని ప్రాంతాల్లో కూడా గరిష్టస్థాయిలో వర్షపాతం నమోదైంది.

మొత్తంగా రానున్న మూడు రోజుల పాటు నగరంలో వర్షాలు కురవనున్నాయి. ఇది ఇలా ఉంటే.. కొన్ని రోజుల నుంచి పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇక ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళ గజగజ వణికిపోయింది. వందలామంది  మరణించగా, మరెందరో గల్లంతయ్యారు. ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరదలు సృష్టించిన విధ్వంసమే కనిపిస్తుంది. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోని కాకుండా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాకఖండ్ వంటి పలు రాష్ట్రాల్లను వరద నీరు ముచ్చెంత్తింది. కొండ చరియలు విరిగిపడి.. అనేక జాతీయ రహదారులు మూతపడ్డాయి. మొత్తంగా నగరంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురవనున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom