iDreamPost
android-app
ios-app

నేడు హైదరాబాద్ లో విద్యుత్ బంద్! ఏఏ ప్రాంతాల్లో అంటే..

Hyderabad News: నేడు హైదాబాద్ ప్రజలకు కీలక అలెర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ నిలిచిపోనుంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ నిలిపోనుంది. మరి.. ఆ ఏరియాలు ఏంటంటే...

Hyderabad News: నేడు హైదాబాద్ ప్రజలకు కీలక అలెర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ నిలిచిపోనుంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ నిలిపోనుంది. మరి.. ఆ ఏరియాలు ఏంటంటే...

నేడు హైదరాబాద్ లో విద్యుత్ బంద్! ఏఏ ప్రాంతాల్లో అంటే..

హైదరాబాద్ నగరంలో ఎంతో మంది నివాసం ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉద్యోగాలు  చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలను ప్రజలకు అందిస్తుంది. అయితే పలు కారణాలతో, వివిధ పనుల నిమిత్తం కొన్ని సందర్భాల్లో విద్యుత్ , నీళ్లను బంద్ చేస్తుంటారు గ్రేటర్ అధికారులు. అయితే తాజాగా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో  శనివారం విద్యుత్ నిలిచిపోనుంది. మరి.. ఆ ప్రాంతాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయునుంది.జీడిమెట్ల సమీపంలోని షాపూర్ నగర సబ్ స్టేషన్ పరిధిలో రిపేర్లు జరుగుతున్నాయి. ఈ కారణంగా శనివారం ఆ ప్రాంతం పరిధిలోని పలు ఏరియాల్లో కరెంట్ సప్లయ్ నిలిచిపోనుందని ఏఈ కృష్ణ తెలిపారు. హెచ్ ఏఏల కాలనీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఆగిపోనుంది. అలానే ఆదర్శ్​నగర్​ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ బంద్ కానుంది. అదే విధంగా సూరారం, శ్రీరాంనగర్​లోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం5 వరకు 11కేవీ భగత్​సింగ్​నగర్​ ఫీడర్​పరిధిలోని ప్రాంతాలకు  కరెంట్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

Power cut in Hyd

భాగ్యనగరంలో ఇలా తరచూ వివిధ పనుల కారణంగా కేవలం విద్యుత్ నే కాకుండా మంచి నీటి సరఫరా కూడా ఆగిపోతుంది. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు మరియు త్రీఫేస్ విద్యుత్తు కొరకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయు నిమిత్తం..వంటి వివిధ పనుల నిమితం పలు ఏరియాల్లో విద్యుత్ ను నిలిపిస్తుంటారు. అలానే మంచినీటి సరఫరా విషయంలో కూడా  వివిధ కారణాలతో బంద్ చేస్తారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. ఒక కాల వ్యవధిలో మాత్రమే విద్యుత్, నీటి సరఫరా బంద్ జరుగుతుంది. అది కూడా ప్రాంతాల వారిగా డివైడ్ చేసి.. విద్యుత్ సరఫరా నిలిపిస్తుంటారు. ఇలా హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా షాపూర్ నగర్ సబ్ స్టేషన్ ప్రాంతం పరిధిలోని పలు ఏరియాల్లో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సమయాల్లో కరెంట్ సరఫరా ఆగిపోనుంది.