Hyderabad: హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలు.. తెలంగాణ హైకోర్టు మరో కీలక తీర్పు!

Hyderabad News: ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో హుస్సేన్ సాగర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. కారణం.. నగరంలోని గణేష్ విగ్రహాలన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో కీలక తీర్పు ఇచ్చింది.

Hyderabad News: ప్రతి ఏటా హైదరాబాద్ లో జరిగే వినాయక చవితి వేడుకల్లో హుస్సేన్ సాగర్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. కారణం.. నగరంలోని గణేష్ విగ్రహాలన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. తాజాగా మరో కీలక తీర్పు ఇచ్చింది.

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా గణపతి బప్పా మోరియా.. మంగళ మూర్తీ మోరియా అనే కీర్తనలు వినిపిస్తున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా మండపాలు అందంగా అలంకరించి అందులో గణపతి మూర్తిని ప్రతిష్టించారు. నవరాత్రులు భక్తులు ఎంతో నిష్టగా పూజలు చేసి.. ఆ తరువాత గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Show comments