హైదరాబాద్​లో మరో కేబుల్ బ్రిడ్జి.. ఆ నేషనల్ హైవేతో కనెక్టివిటీ!

Cable Bridge: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. సిటీలో మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Cable Bridge: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. సిటీలో మరో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హైదరాబాద్ సిటీలో రోజురోజుకీ ట్రాఫిక్ మరింత ఎక్కువవుతోంది. నగరం నాలుగు వైపులా విస్తరించడం, ఐటీ కంపెనీలతో పాటు ఇతర రంగాలకు చెందిన పలు సంస్థల్లోనూ ఉద్యోగాల కోసం భారీగా జనం నగరంలోకి రాకపోకలు సాగిస్తున్నారు. జాబ్స్​తో పాటు చదువులు, వ్యాపారాలు కోసమని సిటీకి వచ్చి పోతున్నారు. వైద్యం కోసం నగరానికి రాకపోకలు సాగించే వారు కూడా ఎక్కువయ్యారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్​కు భారీగా జనాలు వచ్చిపోవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వర్షం పడినప్పుడు ఇది మరింత తీవ్రంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్​పాస్​ల నిర్మాణంపై దృష్టి పెడుతోంది.

ఫైఓవర్​లు, అండర్​పాస్​లు, ఫుట్ ఓవర్​ బ్రిడ్జిలు నిర్మించడంతో పాటు అవసరమైన చోటు రోడ్డును విస్తరించడం వంటి పనుల్ని కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అలాగే కేబుల్ బ్రిడ్జి లాంటివి నిర్మించి ట్రాఫిక్​ను నియంత్రించడంతో పాటు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​లో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రేవంత్ సర్కారు రెడీ అవుతోంది. ఆల్రెడీ దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఇలాంటిదే మరో బ్రిడ్జి నిర్మాణానికి గవర్నమెంట్ ప్రణాళికలు రచిస్తోంది. పాతబస్తీకి దగ్గర్లోని మీరాలం చెరువును టూరిజం హబ్​గా మార్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్​ఎండీఏ ప్లాన్స్ వేస్తోంది. దీనికి అవసరమైన పాలనా పరమైన అనుమతులు రావడంతో మీరాలం ఏరియా డెవలప్​మెంట్ ప్లాన్​ రూపకల్పనకు కసరత్తులు మొదలుపెట్టింది.

మీరాలం లేక్ ఫ్రంట్ పార్క్​ను డెవలప్​ చేస్తే పరిసర ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. దుర్గం చెరువు తరహాలోనే ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్​ను రెండేళ్లలో పూర్తి చేసేలా హెచ్​ఎండీఏ ఒక కన్సల్టెన్సీ ద్వారా ప్రతిపాదనల్ని రూపొందించింది. కొత్త కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.381 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు సర్కారు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జిని బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే 44తో కనెక్ట్ చేయనున్నారు. ఈ హైలెవల్ ఐకానిక్ బ్రిడ్జిని నాలుగు లైన్లతో 2.65 కిలోమీటర్ల పొడువుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్​లో ఒక చోట 110 మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్​ను ఏర్పాటు చేయనున్నారు. బ్రిడ్జిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు అర్నమెంటల్ లైటింగ్​ను కూడా ఏర్పాటు చేస్తారు. మరి.. హైదరాబాద్​లో రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించనుండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments