ఇక చాలు ఆపేయండి.. సినీ నటులకు కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Congress Warning Trolling on Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అక్కినేని సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వరుసగా సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

Congress Warning Trolling on Konda Surekha: మంత్రి కొండా సురేఖ.. అక్కినేని సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై వరుసగా సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాల్లో దుమారం రేపాయి. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని అంటున్నారు. రాజకీయ విషయాల్లో సినిమా వాళ్లను ఎందుకు లాగుతారు అంటూ తీవ్రంగా విమర్శించారు. కొండా సురేఖపై వరుసగా ట్రోలింగ్స్, విమర్శలు రావడంతో దీనికి ముగింపు పలికేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునితా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత లు విడాకులు తీసుకున్నారని మీడియా వేదికగా ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు.. సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఆమె వ్యాఖలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా కొండా సురేఖపై వరుసగా ట్రోల్స్.. విమర్శలు రావడంతో కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Show comments