sai
Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపు 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీప్ సెక్రటరీ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కూడా ఉన్నారు.
Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపు 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీప్ సెక్రటరీ ఉత్తర్వూలు జారీ చేశారు. ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కూడా ఉన్నారు.
sai
ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా తొలిసారిగా భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఇదే సమయంలో అందరు ఆసక్తిగా ఎదురు చూసిన ఓ అంశంపై కూడా క్లారీటి వచ్చింది. ఈ బదిలీల్లో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కి స్థాన చలనం అయ్యింది. మరి.. ఈ బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం…
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 26 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సీఎస్ తరువాత కీలకమైన సీఎంవో సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది. ఇక తాజాగా బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్, గద్వాల జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్వీతా సబర్వాల్ పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ఛీప్ సెక్రటరీగా ఉన్న స్మితను.. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు.
అంతేకాక మరికొంత మంది ఐఏఎస్ లకు వివిధ శాఖల్లో, వివిధ విభాగాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ ను ప్రభుత్వం కేటాయించలేదు. మరి.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ బదిలీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.