SNP
SNP
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్తోనే టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్ములేపాడు. డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ చేయాలనేది చాలా మంది క్రికెటర్ల కల. ఆ కలను నిజం చేసుకుంటూ ఏకంగా 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి.. తన కెరీర్కు అద్భుతమైన పునాది వేసుకున్నాడు. భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి హేమాహేమీలు సైతం ఆచితూచి ఆడిన పిచ్పై భయంలేకుండా బ్యాటింగ్ చేసి.. టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్కు ఫ్యూచర్ స్టార్గా కనిపిస్తున్నాడీ 21 ఏళ్ల కుర్రాడు. అయితే.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అతన జర్నీ అంతా సాదాసీదాగా సాగలేదు. ఎన్నో కష్టాలు పడి అతను ఈ స్థాయికి వచ్చాడు.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జైస్వాల్.. తన తొలి సెంచరీని కన్నవారికి అకింతం ఇచ్చాడు. ఇందులో వాళ్లపై తనకున్న ప్రేమతో పాటు, తన కోసం వాళ్ల పడ్డ కష్టం కూడా ఎంతో ఉందని తెలుస్తుంది. అందుకే ఫస్ట్ సెంచరీని తన తల్లిదండ్రులకు డెడికేట్ చేశాడు. అయితే.. కొడుకు సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ.. పార్టీలు చేసుకోకుండా జైస్వాల్ వాళ్ల నాన్న గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చి, తొలి మ్యాచ్లోనే కొడుకు సెంచరీతో అదరగొట్టడంతో కృతజ్ఞతగా సాంప్రదాయ ‘కన్వర్ యాత్ర’ చేపట్టారు.
తన కుమారుడు తొలి మ్యాచ్లో బాగా ఆడినందుకు, అలాగే భవిష్యత్తులో టీమిండియా తరఫున మరిన్ని మంచి ప్రదర్శనలు చేయాలని కోరుతూ.. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వరకు కాలినడక యాత్రను చేపట్టారు. దాదాపు 500 కిలో మీటర్ల దూరం నడిచి.. మొక్కు తీర్చుకోనున్నారు. జైస్వాల్ తండ్రి తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. సక్సెస్లోనూ దైవాన్ని మర్చిపోని ఆయన తత్వం గొప్పదంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి జైస్వాల్ తండ్రి భూపేంద్ర జైస్వాల్ చేపట్టిన కాలినడక యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yashasvi Jaiswal’s father went on a kanwar yatra travelling on foot from UP to Uttarakhand to pray for Yashasvi’s success. pic.twitter.com/hxchthQgI6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 15, 2023
ఇదీ చదవండి: వీడియో: గ్రౌండ్లో పడుకున్న కోహ్లీ! అలా ఎందుకు చేశాడంటే?