iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇకపై కెప్టెన్ కాలేడా? బోర్డు అన్నీ గమనించింది!

  • Published Jul 17, 2024 | 3:34 PM Updated Updated Jul 17, 2024 | 3:34 PM

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను.

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను.

  • Published Jul 17, 2024 | 3:34 PMUpdated Jul 17, 2024 | 3:34 PM
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇకపై కెప్టెన్ కాలేడా? బోర్డు అన్నీ గమనించింది!

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా ఒడిసి పట్టడంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోల్ ఎంతో ఉంది. ఫైనల్ మ్యాచ్​లో కీలక సమయంలో క్లాసెన్, మిల్లర్ వికెట్లు తీసి మ్యాచ్​ను భారత్ వైపు తిప్పాడతను. టైటిల్ ఫైట్ అనే కాదు.. మెగా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. ఐపీఎల్​ టైమ్​లో బ్యాటింగ్, బౌలింగ్​లో ఫెయిలైన పాండ్యా.. పొట్టి కప్పులో మాత్రం తనలోని రియల్ టాలెంట్​ను బయటకు తీశాడు. వరల్డ్ కప్ ముగిశాక స్వదేశానికి వచ్చిన అతడు.. పలు ఈవెంట్స్​లో పాల్గొంటూ బిజీగా గడిపాడు. ఎట్టకేలకు సొంత నగరం వడోదరకు చేరుకున్న స్టార్ ఆల్​రౌండర్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీ20 క్రికెట్​కు కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్​బై చెప్పడంతో కొత్త సారథిని నియమించే పనుల్లో బిజీగా ఉంది బీసీసీఐ. ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్​ కోసం ఒకట్రెండు రోజుల్లో టీమ్స్​ను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఇదే అవకాశంగా జట్టుకు పర్మినెంట్ కెప్టెన్​ను అనౌన్స్​ చేయాలని భావిస్తోందట. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​ను ఆ పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయిందట. అయితే టీ20 ప్రపంచ కప్​లో వైస్ కెప్టెన్​గా ఉన్న పాండ్యాను కాదని సూర్యను కెప్టెన్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. పొట్టి కప్పులో రాణించినా హార్దిక్​ను పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే స్వయం కృతాపరాధమే అతడి కొంపముంచిందని తెలుస్తోంది. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా అతడి ప్రవర్తనను భారత క్రికెట్ బోర్డు గమనించింది. రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్​ సూచనల్ని అతడు పట్టించుకోలేదు. సూర్యకుమార్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లను పాండ్యా కలుపుకొని వెళ్లకపోవడం బోర్డుకు నచ్చలేదట.

ప్లేయర్​గా హార్దిక్ స్కిల్స్​ మీద అనుమానాలు లేకపోయినా బిహేవియర్, యాటిట్యూడ్ పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. ఎంఐ సారథిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన విధంగానే ఇంటర్నేషనల్ టీమ్​లోనూ అదే తీరుతో ఉంటే కష్టమని బీసీసీఐ భావించిందట. పాండ్యా కెప్టెన్​గా అదే యాటిట్యూడ్​ను చూపిస్తే ఆటగాళ్లలో యూనిటీ పోతుందని భయపడిందట. ఇది ఆలోచించే అనూహ్యంగా సూర్యకుమార్ పేరును తీసుకొచ్చారని సమాచారం. టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే కెప్టెన్​గా ఉంచాలని డిసైడ్ అయిందట బోర్డు. ఆ తర్వాత ఎలాగూ శుబ్​మన్ గిల్ వచ్చేస్తాడు. దీంతో ఇక హార్దిక్​కు కెప్టెన్సీ దక్కే స్కోప్ కనిపించడం లేదు. సేమ్ టైమ్ వన్డే, టెస్టులకు కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి.. పాండ్యా విషయంలో బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Giriş