iDreamPost
android-app
ios-app

కోహ్లీ విషయంలో తాను అబద్ధం చెప్పినట్లు వెల్లడించిన డివిలియర్స్‌!

  • Published Feb 09, 2024 | 11:27 AMUpdated Feb 09, 2024 | 4:25 PM

విరాట్‌ కోహ్లీ విషయంలో ఇటీవల డివిలియర్స్‌ ఒక సంచలన విషయం వెల్లడించి.. కోహ్లీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. కానీ, ఇప్పుడు యూటర్న్‌ తీసుకోని అదంతా అబద్ధమంటూ మరోసారి అందర్ని షాక్‌కు గురిచేశాడు. డివిలియర్స్‌ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

విరాట్‌ కోహ్లీ విషయంలో ఇటీవల డివిలియర్స్‌ ఒక సంచలన విషయం వెల్లడించి.. కోహ్లీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. కానీ, ఇప్పుడు యూటర్న్‌ తీసుకోని అదంతా అబద్ధమంటూ మరోసారి అందర్ని షాక్‌కు గురిచేశాడు. డివిలియర్స్‌ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 09, 2024 | 11:27 AMUpdated Feb 09, 2024 | 4:25 PM
కోహ్లీ విషయంలో తాను అబద్ధం చెప్పినట్లు వెల్లడించిన డివిలియర్స్‌!

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ విషయంలో తాను చెప్పిందంతా అబద్ధం అంటూ సౌతాఫ్రికా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ బాంబు పేల్చాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి హఠాత్తుగా తప్పుకున్న కోహ్లీ.. మళ్లీ తిరిగి టీమ్‌లోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అసలు కోహ్లీ ఎందుకు రెస్ట్‌ తీసుకున్నాడో కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు. అటు బీసీసీఐ కానీ, ఇటు కోహ్లీ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడని, కోహ్లీ-అనుష్క దంపతులు త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు, అందుకే కోహ్లీ కుటుంబంతో గడిపేందుకు వెళ్లాడంటూ డివిలియర్స్‌ వెల్లడించాడు.

ఈ విషయంతో కోహ్లీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. కోహ్లీ వారసుడు రాబోతున్నాడు, జూనియర్‌ కోహ్లీ కోసం వెయిటింగ్‌ అంటూ తెగ మురిసిపోయారు. వారి సంతోషంపై నీళ్లు చల్లుతూ.. తాను చెప్పిదంతా అబద్ధమంటూ తాజా డివిలియర్స్‌ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. అసలు కోహ్లీ ఎందుకు టీమ్‌కు దూరం అయ్యాడో, ఎందుకు రెస్ట్‌ తీసుకుంటున్నాడో ఎవరికీ తెలియదంటూ పేర్కొన్నారు. దీంతో మరోసారి కోహ్లీ ఎందుకు ఇంటికి వెళ్లాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ ఆడాల్సి ఉంది. తొలి టెస్ట్‌ కోసం జట్టుతో పాటు హైదరాబాద్‌ కూడా వచ్చాడు. కానీ, అనూహ్యంగా వ్యక్తిగత కారణాలంటూ జట్టును వీడి.. ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్‌ లేదు. దీంతో.. కోహ్లీ గైర్హాజరీపై ఏవేవో ఊహాగానాలు వస్తున్నాయి. తొలుత వాళ్ల అమ్మ అనారోగ్యంతో ఉందని అందుకే కోహ్లీ ఇంటికి వెళ్లాడని వార్తలు వచ్చాయి. కానీ, తమ అమ్మ ఆరోగ్యం బానే ఉందని కోహ్లీ తమ్ముడు వికాస్‌ కోహ్లీ వెల్లడించాడు. తర్వాత కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడు, అందుకే ఇంటికి వెళ్లాడని ప్రకటించిన డివిలియర్స్‌, ఇప్పుడు అదంతా అబద్ధం అంటున్నాడు. దీంతో.. కోహ్లీ విషయంలో అంతా గందరగోళంగా మారింది. ఈ విషయంపై కోహ్లీనే స్పందిస్తే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి డివిలియర్స్‌ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి