iDreamPost
android-app
ios-app

World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

  • Published Oct 13, 2023 | 1:57 PM Updated Updated Oct 13, 2023 | 1:57 PM
  • Published Oct 13, 2023 | 1:57 PMUpdated Oct 13, 2023 | 1:57 PM
World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా, పాకిస్థాన్‌ రెండేసి విజయాలతో ఎంతో స్ట్రాంగ్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్‌ నెదర్లాండ్స్‌, శ్రీలంకపై గెలిస్తే.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌పై ఘన విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రేజీ ఫైట్‌కు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్‌ జట్టు.. చాలా కాలం తర్వాత టీమిండియాతో భారత గడ్డపై మ్యాచ్‌ ఆడుతోంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పైగా ఫ్యాన్స్‌ ఎక్స్‌పెట్టేషన్‌ ఎలాగో హైలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అలాగే ఈ మ్యాచ్‌ కోసం తాను మెంటల్‌గా, ఫిజికల్‌గా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. నిజానికి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటేనే మన ది బెస్ట్‌గా ఉండాలని అన్నాడు. కోహ్లీ కామెంట్స్‌తో భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ఖుష్‌ అవుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం కోహ్లీ ఫుట్‌ ఫ్రిపేర్డ్‌గా ఉన్నాడని, ఇక కోహ్లీని అడ్డుకోవడం ఎవరీ వల్ల కాదని అంటున్నారు. పాకిస్థాన్‌ బౌలర్లు షాహీన్‌ షా అఫ్రిదీ, హరీస్‌ రౌఫ్‌, హసన్‌ అలీలకు బ్యాండ్‌ బాజా బారత్‌ తప్పదంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

అయితే.. ఈ వరల్డ్‌ కప్‌ కంటే ముందు జరిగిన ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కోహ్లీతో పాటు ఆ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సైతం సెంచరీతో అదరగొట్టాడు. అంతకంటే ముందు టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో కోహ్లీ ఆడిన 82 పరుగులు ఇన్నింగ్స్‌ని ఎవరు మర్చిపోగలరు. దాదాపు ఓటమి అంచులో ఉన్న టీమిండియాను విజయతీరాలకు నడిపించాడు. మ్యాచ్‌ గెలిచేశామనే కాన్ఫిడెన్స్‌తో ఉన్న పాకిస్థాన్‌కు దిమ్మతిరిగేలా.. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సులతో మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కేవలం 8 బంతుల్లో 28 రన్స్‌ కావాల్సిన దశలో కోహ్లీ ఆడిన షాట్లు ప్రతి భారతీయుడి గుండెల్లో అలా నిలిచిపోతాయి. అలాంటి మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్‌ చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి పాక్‌తో మ్యాచ్‌కు తాను లోడ్‌ చేసిన గన్‌లా రెడీగా ఉన్నానని కోహ్లీ చేసిన కామెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్! ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్! కారణం?