iDreamPost
android-app
ios-app

గిల్ సూపర్ సక్సెస్ కోహ్లీకి శాపం కానుందా? ఫ్యాన్స్‌లో భయం!

  • Published Sep 26, 2023 | 1:07 PM Updated Updated Sep 26, 2023 | 1:07 PM
  • Published Sep 26, 2023 | 1:07 PMUpdated Sep 26, 2023 | 1:07 PM
గిల్ సూపర్ సక్సెస్ కోహ్లీకి శాపం కానుందా? ఫ్యాన్స్‌లో భయం!

ఇండియన్‌ క్రికెట్‌లో మరో శకం ముగుస్తున్నట్లు కనిపిస్తోంది. సచిన్‌ టెండ్కూలర్‌ తర్వాత.. భారత క్రికెట్‌ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం పొందిన విరాట్‌ కోహ్లీ కొన్నేళ్లుగా ఇండియన్‌ క్రికెట్‌ను ఏలుతున్నాడు. ఇప్పుడు అతని తరం కూడా ముగింపుకు వచ్చిందా? అనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం.. ఓ చిచ్చర పిడుగు, పరుగుల దాహంతో రెచ్చిపోవడమే. అతనెవరో కాదు.. ప్రిన్స్‌ శుబ్‌మన్‌ గిల్‌. ఇండియన్‌ క్రికెట్‌కు సచిన్‌ దేవుడైతే.. కోహ్లీ కింగ్‌. మరి వీరిద్దరి తర్వాత ఆ స్థానం ఈ ప్రిన్స్‌దే అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి శుబ్‌మన్‌ వారి స్థాయికి చేరుకునేందుకు అర్హత కలిగి ఉన్నాడా? ఇప్పటి వరకు ఏం సాధించాడో? అతని వల్ల ప్రస్తుతం కోహ్లీకి వచ్చిన నష్టమేంటో చూద్దాం..

24 ఏళ్ల ఈ క్లాస్‌ బ్యాటర్‌.. 2018లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. కేకేఆర్‌ తరఫున అద్భుత ప్రదర్శనతో వెలుగులోని వచ్చాడు. అదే ఏడాది అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇక 2019లోనే టీమిండియాలోకి అడుగుపెట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు గిల్‌. ఐపీఎల్‌తో పాటు ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారిపోయాడు. ముఖ్యంగా వన్డేలు, టెస్టులో అద్భుతంగా ఆడాడు. ఏకంగా శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ స్పాట్‌కే ఎసరుపెట్టేసి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా మారిపోయాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు, వన్డేల్లో డబుల్‌ సెంచరీతో ఇండియన్‌ క్రికెట్‌ సెన్సెషన్‌గా మారిపోయాడు.

గిల్‌ ఇలా చెలరేగుతుండటంతో ప్రస్తుతం భారత క్రికెట్‌లో కోహ్లీ హవా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోహ్లీ వయసు 34 ఏళ్లు మహా అయితే మరో 3, 4 ఏళ్లు ఆడే అవకాశం ఉంది. ఈ వరల్డ్‌ కప్‌ తర్వాత కోహ్లీ కెరీర్‌ సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా లేకపోయినా.. టీమిండియా సమతుల్యంగా కనిపిస్తోంది. ఇక కోహ్లీ కంటే ముందే రోహత్‌ కెరీర్‌ ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాను యువ రక్తం చేతిలో పెట్టాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉంది. బలమైన టీమ్‌ను బిల్డ్‌ చేసే క్రమంలో.. పాత తరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త టీమ్‌ను నిర్మించాలి. ఈ క్రమంలో కోహ్లీ తర్వాత అలాంటి బాధ్యతలను శుబ్‌మన్‌ గిల్‌ నిర్వర్తించే అవకాశం ఉంది. బీసీసీఐ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సైతం అదే భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కోహ్లీని చాలా వరకు దూరంగా పెడుతూ వస్తున్నారు. వరల్డ్‌ కప్‌ తర్వాత.. కోహ్లీని టెస్టులకు మాత్రమే పరిమితం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి ఇండియన్‌ క్రికెట్‌కు నెక్ట్స్‌ కోహ్లీగా గిల్‌ను భావిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని రికార్డును బద్దలుకొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌