iDreamPost
android-app
ios-app

వీడియో: ట్రాలీలో అంతర్జాతీయ క్రికెటర్ల లగేజ్ తరలింపు! ఇదేం ఆతిథ్యం సామి?

  • Published Apr 25, 2024 | 3:20 PM Updated Updated Apr 25, 2024 | 3:20 PM

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు.

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు.

  • Published Apr 25, 2024 | 3:20 PMUpdated Apr 25, 2024 | 3:20 PM
వీడియో: ట్రాలీలో అంతర్జాతీయ క్రికెటర్ల లగేజ్ తరలింపు! ఇదేం ఆతిథ్యం సామి?

క్రికెట్​లో హోమ్ సిరీస్​లతో పాటు ఇతర దేశాలకు కూడా టీమ్స్ వెళ్లడం కామనే. వేరే జట్లు తమ దగ్గరకు వస్తే ఆతిథ్యంతో వారిని ఇంప్రెస్ చేయాలని అందరూ చూస్తుంటారు. అందుకోసం సూపర్బ్​గా ఏర్పాట్లు చేస్తుంటారు. ఎయిర్​పోర్ట్​లో దిగినప్పటి నుంచి తిరిగి స్వదేశానికి పయనమయ్యేంత వరకు వారికి ఓ రేంజ్​లో అతిథి మర్యాదలు చేస్తారు. లగ్జరీ హోటల్స్ బుక్ చేయడం, టేస్టీ ఫుడ్​ అరేంజ్ చేయడం, టైట్ సెక్యూరిటీ, టాప్ క్లాస్ వెహికిల్స్​లో వాళ్లను తిప్పుతూ ఆ దేశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంటారు. పెద్ద దేశాలనే కాదు.. స్మాల్ కంట్రీస్ కూడా ఆతిథ్యంలో తమకు అయినంతలో మంచి ఏర్పాట్లు చేస్తూ ఆటగాళ్ల మనసుల్ని దోచుకుంటాయి. అయితే ఓ దేశం మాత్రం ఈ విషయంలో ప్రవర్తించిన తీరుకు విమర్శలు మూటగట్టుకుంటోంది.

టీ20 సిరీస్​లో భాగంగా నేపాల్​ పర్యటనకు వచ్చింది వెస్టిండీస్-ఏ జట్టు. మ్యాచులు ఆడటంతో పాటు నేపాల్​ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయాలని ప్లేయర్లు అనుకున్నారు. కానీ వారికి ఎయిర్​పోర్ట్​లోనే చుక్కెదురైంది. విండీస్ ఆటగాళ్ల కోసం నేపాల్ సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం వాళ్ల లగేజ్ తీసుకెళ్లేందుకు కూడా వెహికిల్స్ అరేంజ్ చేయలేదు. ఓ ట్రాలీలో లగేజ్​ను తరలించారు. ఎయిర్​పోర్ట్​లో నుంచి బయటకు రాగానే సాదాసీదా ఆటోలో క్రికెటర్లు తమ బ్యాగులు, సూట్​కేస్​లను పెట్టి బస్సు ఎక్కి హోటల్​కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కరీబియన్ ఆటగాళ్ల లగేజ్ తీసుకెళ్లేందుకు సాధారణ ఆటోను అందుబాటులో ఉంచిన నేపాల్ క్రికెట్ బోర్డు.. వాళ్లు ప్రయాణించేందుకు కూడా ఆర్డినరీ టూరిస్ట్ బస్​ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. క్రికెట్​లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టీమ్ ఇలాంటి చర్యలతో పరువు పోగొట్టుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లు విజిట్ కోసం వస్తే ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఏంటని షాకవుతున్నారు. మున్ముందు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే క్రికెట్ వరల్డ్​లో ఆ దేశం మరింత అభాసు పాలవడం పక్కా అని చెబుతున్నారు. మరి.. విండీస్ క్రికెటర్ల కోసం నేపాల్ బోర్డు చేసిన ఏర్పాట్లపై వస్తున్న విమర్శల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet