VIDEO: ఆసియా కప్‌ టీమ్‌ ఎంపికైపోయింది! వాడు లేడు వీడు లేడు: గవాస్కర్‌

ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి క్రికెట్‌ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. జట్టు ఎంపిక బాగానే ఉన్నా.. ఒకరిద్దరు ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని, వాళ్లను ఎంపిక చేయాల్సిందని అంటూ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ విషయంలో క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. వీళ్లిద్దరికీ తీవ్ర అన్యాయం జరిగిందని వీళ్లను ఆసియా కప్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఇదే విషయంపై భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌ కోసం రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేయాల్సిందని మీరు భావిస్తున్నారా? అని జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు చాలా వైల్డ్‌గా రియాక్ట్‌ అయిన గవాస్కర్‌.. ‘అశ్విన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది కానీ, చేయలేదు. ఇలా కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు చాలా అన్‌లక్కీ అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఈ అశ్విన్‌ గిశ్విన్‌ లాంటి మాటలు మనం మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు టీమ్‌ ఎంపిక జరిగిపోయింది. ఇదే మన టీమ్‌. జట్టు నచ్చకుంటే మ్యాచ్‌లు చూడ్డం మానేయండి.

అంతేకానీ, వాళ్లను తీసుకోవాల్సింది, వీళ్లను తీసుకోవాల్సింది అంటూ అనవసరపు కాంట్రవర్సీని క్రియేట్‌ చేయొద్దు’ అంటూ కాస్త కోపంగానే అన్నారు. అయితే.. అశ్విన్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి ఆటగాళ్లకు ఇంకా వరల్డ్‌ కప్‌ కోసం తలుపులు తెరుచుకునే ఉన్నాయని తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించడం విశేషం. అయితే తమకు ఉన్న పరిమితుల్లోనే తాము ఎంపిక చేసుకున్నామని, చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై రోహిత్‌ స్పందిస్తూ.. టీమ్‌లో ఇద్దరు రిస్ట్‌ స్పిన్నర్లు ఎందుకని, కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. మరి ఆసియా కప్‌కు అశ్విన్‌ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్ టీమ్.. జట్టులో వీళ్లను ఎంపిక చేయడం దండగేనా?

Show comments