సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వరల్డ్‌ కప్‌ ప్రోమో! మీరూ చూసేయండి

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మహా సంగ్రామం కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇప్పటికే ఖరారైపోయింది. ఇండియా వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. ఈ టోర్నీకి సంబంధించి ఓ ప్రోమోను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బాలీవుడ్‌ బాద్‌షా కూడా తళుక్కున మెరిశాడు.

ఆటలో ఉండే భావోద్వేగాలు, విజయానందాలు, ఓటమి భారం, గతంలో సాధించిన విజయాలను ఈ ప్రోమోలో చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ప్రోమో మాత్రం అదిరిపోయిందంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ ప్రోమో వీడియో సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఈ వీడియో చూసి ఫుల్‌ ఖుషీ అవుతూ లైకులు, షేర్లు కొడుతున్నారు.

కాగా.. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌లో వరల్డ్‌ కప్‌ సమరానికి టాస్‌ పడనుంది. ఇండియా తమ మొదటి మ్యాచ్‌ అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్‌ 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టోర్నీకే హైలెట్‌గా నిలువనుంది. అయితే.. 2011లో టీమిండియా గెలిచిన వరల్డ్‌ కప్‌ టోర్నీ సైతం ఇండియాలోనే జరగడం, ఇప్పుడు ఈ టోర్నీ కూడా మన దేశంలోనే జరుగనుండటంతో ఆ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి కిందున్న వరల్డ్‌ కప్‌ ప్రోమో వీడియోను చూసి, ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యూవీ దెబ్బకు అతని కెరీర్‌ క్లోజ్‌ అనుకున్నారు! కానీ, చరిత్ర సృష్టించాడు

Show comments