iDreamPost
android-app
ios-app

కాన్పూర్ స్టేడియానికి రోహిత్ ఫీవర్.. ఒక్క సిక్స్ కొట్టినా ఇక అంతే సంగతులు!

  • Published Sep 25, 2024 | 10:02 PM Updated Updated Sep 25, 2024 | 10:14 PM

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బంగ్లాదేశ్​తో జరిగే సెకండ్ టెస్ట్​లో దుమ్మురేపాలని అనుకుంటున్నాడు.

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బంగ్లాదేశ్​తో జరిగే సెకండ్ టెస్ట్​లో దుమ్మురేపాలని అనుకుంటున్నాడు.

  • Published Sep 25, 2024 | 10:02 PMUpdated Sep 25, 2024 | 10:14 PM
కాన్పూర్ స్టేడియానికి రోహిత్ ఫీవర్.. ఒక్క సిక్స్ కొట్టినా ఇక అంతే సంగతులు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఫుల్ కసి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భారీ బౌండరీలు, సిక్సులతో బంగ్లాదేశ్​ మీద విరుచుకుపడాలని చూస్తున్నాడు. ఆ జట్టుతో చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్​లో హిట్​మ్యాన్ ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్​లో 6 పరుగులు చేసిన భారత సారథి.. రెండో ఇన్నింగ్స్​లో 5 పరుగులు చేశాడు. అయితే రెండో టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్​లో ఇది రిపీట్ అవ్వొద్దని కోరుకుంటున్నాడు. బిగ్ ఇన్నింగ్స్​తో బంగ్లాకు మరింత పోయించాలని అనుకుంటున్నాడు. అయితే హిట్​మ్యాన్​కు అటు అపోజిషన్ టీమ్​తో పాటు ఇటు కాన్పూర్ స్టేడియం నిర్వాహకులు కూడా భయపడుతున్నారు.

కాన్పూర్ స్టేడియానికి రోహిత్ భయం పట్టుకుంది. అతడు ఎక్కడ సిక్సులతో విరుచుకుపడతాడోనని స్టేడియం నిర్వాహకులు వణికిపోతున్నారు. దీనికి కారణం ఆ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉండటమేనని తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత ఈ గ్రౌండ్​లో జరగనున్న తొలి టెస్ట్ ఇదే. ఇందులోని ఒక స్టాండ్​ బలహీనంగా ఉందని ఉత్తర్​ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్​మెంట్ చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ స్టాండ్​ ఫుల్‌ కెపాసిటీ మేరకు ఫ్యాన్స్​ నిండితే కూలిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్స్ తెలిపినట్లు వినిపిస్తోంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు బిగ్ సిక్సులు కొడితే అభిమానులు ఎగిరి గంతేస్తే ప్రేక్షకుల బరువును కూడా ఆ స్టాండ్ మోయలేదట. ఈ రీజన్ వల్లే సగం కంటే తక్కువగా టికెట్లు అమ్ముతున్నట్లు సమాచారం.

కాన్పూర్ స్టేడియం బాల్కనీ C సిచ్యువేషన్ ఆందోళనకరంగా ఉందని.. మ్యాచ్ టైమ్​లో దాన్ని మూసివేయాలని యూపీ క్రికెట్ అసోసియేషన్​ను ఇంజినీర్ల బృందం హెచ్చరించిందని సమాచారం. ఈ స్టాండ్​కు వెంటనే మరమ్మతులు చేయాలని ఒక ఇంజినీర్ చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక, కాన్పూర్ టెస్ట్​లో సేమ్ టీమ్​తో వెళ్లాలని టీమిండియా మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఎలాంటి ఛేంజెస్ చేయొద్దని అనుకుంటున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇక్కడి వికెట్ స్పిన్​కు అనుకూలిస్తుంది కాబట్టి పేసర్ ఆకాశ్​దీప్​కు బదులు చైనామన్ కుల్దీప్ యాదవ్​ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. పిచ్​ను పరిశీలించాకే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.