iDreamPost
android-app
ios-app

Rohit Sharma: నా మైండ్​ బ్లాంక్ అయింది.. వాళ్లే కాపాడారు! వరల్డ్ కప్ ఫైనల్​పై రోహిత్ కామెంట్స్!

  • Published Jul 17, 2024 | 8:24 AMUpdated Jul 17, 2024 | 8:24 AM

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల ప్రపంచ కప్ కల నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల ప్రపంచ కప్ కల నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

  • Published Jul 17, 2024 | 8:24 AMUpdated Jul 17, 2024 | 8:24 AM
Rohit Sharma: నా మైండ్​ బ్లాంక్ అయింది.. వాళ్లే కాపాడారు! వరల్డ్ కప్ ఫైనల్​పై రోహిత్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిరకాల ప్రపంచ కప్ కల నెరవేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఈ విజయం అంత సులువుగా రాలేదు. మెగాటోర్నీలో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​తో పాటు సౌతాఫ్రికా లాంటి బిగ్ టీమ్స్​ను చిత్తు చేసి కప్పును ఒడిసిపట్టింది భారత్. ముఖ్యంగా ప్రొటీస్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. ఒక దశలో సఫారీలదే విజయమని అంతా అనుకున్నారు. ఆ జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి. అప్పటికే భారీ షాట్లతో దూకుడు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్​తో పాటు డేంజరస్ డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ మరో కప్పు చేజార్చుకోవడం ఖాయమని అంతా భయపడ్డారు.

గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్​లో పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్​దీప్ సింగ్ అద్భుతం చేశారు. క్లాసెన్, మిల్లర్​ను పాండ్యా ఔట్ చేయగా.. బుమ్రా, అర్ష్​దీప్ మిగతా వారి పనిపట్టారు. పరుగులు నియంత్రించడమే గాక వికెట్లు కూడా తీస్తూ పోవడంతో అన్ని ఓవర్లు ముగిసేసరికి విజయానికి ఇంకో 7 పరుగుల దూరంలో సౌతాఫ్రికా ఆగిపోయింది. టీమిండియా సగర్వంగా కప్​ను అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్​ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్-మిల్లర్ క్రీజులో ఉన్నప్పుడు తాము పడిన టెన్షన్ గురించి పంచుకున్నాడు. ఆ టైమ్​లో తన మైండ్ బ్లాంక్ అయిందన్నాడు. బౌలర్లే జట్టును కాపాడారని చెప్పాడు. చేయాల్సిన దాని మీదే ఫోకస్ చేస్తూ ముందుకెళ్లడం వర్కౌట్ అయిందన్నాడు హిట్​మ్యాన్.

‘అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయింది. క్లాసెన్ రాక ముందు వరకు మ్యాచ్ బ్యాలెన్స్​డ్​గా ఉంది. కానీ అతడు 15వ ఓవర్​లో భారీ షాట్లు బాదడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఆ టైమ్​లో నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఏం చేయాలనే దాని మీదే ఫోకస్ చేశా. ప్లేయర్లంతా కూల్​గా ఉండటం, మా ప్లాన్స్​ను సరిగ్గా అమలు చేయడం ఎంతో ముఖ్యం. చివరి ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా 30 రన్స్ చేయాల్సిన దశలో మేం ప్రెజర్​లో ఉన్నాం. కానీ మా బౌలర్లు ఆ దశలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే మేం ఎంత ప్రశాంతంగా ఉన్నామో అర్థమవుతుంది. భయపడకుండా మా ప్రణాళికలను అమలు చేస్తూ పోయాం. అదే మాకు కలిసొచ్చింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి.. ఫైనల్ మ్యాచ్​లో బౌలర్లే కాపాడారంటూ హిట్​మ్యాన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Circle of Cricket (@circleofcricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి