iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు శుభవార్త! ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 11:07 AM, Fri - 17 November 23

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చెలరేగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొంతకాలంగా ఇటు విరాట్ ఫ్యాన్స్, అటు రోహిత్ అభిమానులు నిరాశలో ఉన్నారు. దానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఇక ఇదే విషయంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు చెలరేగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొంతకాలంగా ఇటు విరాట్ ఫ్యాన్స్, అటు రోహిత్ అభిమానులు నిరాశలో ఉన్నారు. దానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఇక ఇదే విషయంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది.

  • Author Soma Sekhar Published - 11:07 AM, Fri - 17 November 23
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు శుభవార్త! ఏంటంటే?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న క్రికెట్ వీరులు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో వీరిద్దరు చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఈ మెగాటోర్నీలో లీడింగ్ స్కోరర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇటు రోహిత్ కూడా ఈ లిస్ట్ లో టాప్ ఫైవ్ లో ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కొంతకాలంగా ఇటు విరాట్ ఫ్యాన్స్, అటు రోహిత్ అభిమానులు నిరాశలో ఉన్నారు. దానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఇక ఇదే విషయంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా వరల్డ్ కప్ లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. హిట్ మ్యాన్ ఇటు బ్యాటింగ్ తో రికార్డులు బద్దలు కొడుతూనే జట్టును ముందుండి దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. ఇక ఇటు పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో చెలరేగుతూ.. ప్రత్యర్థి బౌలర్లను దంచికొడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఇటు విరాట్ ఫ్యాన్స్, అటు హిట్ మ్యాన్ అభిమానులు వీరిద్దరిపై ఒకే విషయంలో అసంతృప్తిలో ఉన్నారు. అదేంటంటే? గతేడాది టీ20 ప్రపంచ కప్ లో ఓటమి తర్వాత వీరిద్దరు టీ20 మ్యాచ్ లు ఆడటం మానేశారు.దీంతో ఈ ఫార్మాట్ కు వీరు వీడ్కోలు పలుకుతున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. రోహిత్, కోహ్లీలు టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రముఖ నేషనల్ మీడియా టైమ్స్ నౌ పేర్కొంది. వరల్డ్ కప్ తర్వాత సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు, వచ్చే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ జట్టును నడిపిస్తాడని ఈ పత్రిక తెలిపింది. కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్ ఆడతాడని పేర్కొంది. ఈ న్యూస్ వీరిద్దరి అభిమానుల్లో ఎక్కడా లేని సంతోషాన్ని నింపింది. మరి విరాట్, రోహిత్ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.