iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీకి ఇద్దరు టీమిండియా స్టార్లు దూరం.. సెలెక్ట్ అయినా..!

  • Published Aug 27, 2024 | 6:10 PM Updated Updated Aug 27, 2024 | 6:10 PM

Duleep Trophy 2024, Ravindra Jadeja, Mohammed Siraj: డొమెస్టిక్ క్రికెట్​లో కీలక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. త్వరలోనే ఈ టోర్నీ షురూ కానుంది. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్. ఇద్దరు టీమిండియా స్టార్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.

Duleep Trophy 2024, Ravindra Jadeja, Mohammed Siraj: డొమెస్టిక్ క్రికెట్​లో కీలక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. త్వరలోనే ఈ టోర్నీ షురూ కానుంది. ఈ తరుణంలో ఓ బ్యాడ్ న్యూస్. ఇద్దరు టీమిండియా స్టార్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.

  • Published Aug 27, 2024 | 6:10 PMUpdated Aug 27, 2024 | 6:10 PM
దులీప్ ట్రోఫీకి ఇద్దరు టీమిండియా స్టార్లు దూరం.. సెలెక్ట్ అయినా..!

ఈ మధ్య భారత క్రికెట్​లో ఎక్కువగా మాట్లాడుకుంటోంది దులీప్ ట్రోఫీ-2024 గురించే. నేషనల్ డ్యూటీ లేని టైమ్​లో ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్​లో ఆడాల్సిందేనంటూ బీసీసీఐ కొత్త రూల్​ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమిండియాకు మ్యాచ్​లు లేకపోవడంతో త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలో భారత స్టార్లు అందర్నీ దింపుతోంది బోర్డు. ఈ టోర్నమెంట్​లో పెర్ఫార్మెన్స్ చేసేతీరు, ఫామ్, ఫిట్​నెస్​ ఆధారంగా వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్​ సిరీస్​కు జట్టును సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అభిమానులకు షాకింగ్ న్యూస్. దులీప్ ట్రోఫీకి ఇద్దరు టీమిండియా స్టార్లు దూరమయ్యారు. జట్టులోకి సెలెక్ట్ అయినా వాళ్లు ఈ టోర్నీలో ఆడటం లేదు. ఆ ప్లేయర్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు స్పీడ్​ గన్ మహ్మద్ సిరాజ్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యారు. వీళ్లిద్దరితో పాటు యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా ప్రతిష్టాత్మక టోర్నమెంట్​లో ఆడటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ధృవీకరించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సిరాజ్ స్థానంలో నవదీప్ సైనీ, ఉమ్రాన్ ప్లేస్​లో గౌరవ్ యాదవ్​ను తీసుకుంటున్నట్లు తెలిపింది. టీమ్-బీ నుంచి జడేజాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. సిరాజ్, ఉమ్రాన్​లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. టోర్నమెంట్ మొదలయ్యే నాటికి వీళ్లు అందుబాటులో ఉండే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి ఈ పేసర్లు దూరం కానున్నట్లు తెలిపింది.

సిరాజ్-ఉమ్రాన్ మాలిక్​ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పిన బీసీసీఐ.. జడేజాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మాత్రం చెప్పలేదు. దీంతో అతడు ఏ కారణాల వల్ల టోర్నీకి దూరమయ్యాడో అర్థం కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న సిరాజ్.. బంగ్లాతో సిరీస్​ వరకు కోలుకుంటాడా? అనేది క్లారిటీ లేదు. ఒకవేళ సిరాజ్ రికవరీకి టైమ్ పడితే అతడ్ని ఇంకో ప్లేయర్​తో రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నాలుగైదు నెలలు టీమిండియా షెడ్యూల్​ టైట్​గా ఉంది కాబట్టి సిరాజ్​కు మరింత రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడు ఫుల్​ ఫిట్​నెస్ సాధించాకే టీమ్​లోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, దులీప్ ట్రోఫీ విషయానికొస్తే.. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5వ తేదీన మొదలుకానుంది. మొత్తం నాలుగు టీమ్స్ టోర్నీలో తలపడతాయి. ఇందులోని ఇండియా-ఏ టీమ్​కు శుబ్​మన్ గిల్, ఇండియా-బీ టీమ్​కు అభిమన్యు ఈశ్వరన్, ఇండియా-సీ టీమ్​కు రుతురాజ్ గైక్వాడ్, ఇండియా-డీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.