పాక్‌ టీమ్‌ను బకరాలను చేసి.. సారీ చెప్పిన లంక బోర్డు!

పాకిస్థాన్‌ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. తొలి టెస్ట్‌లో విజయం కూడా సాధించింది. అయితే.. మ్యాచ్‌ తర్వాత జరిగిన పోస్ట్‌ మ్యాచ్‌ ప్రజంటేషన్‌ సెర్మనీలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించడంతో విన్నర్‌కు ఇవ్వాల్సిన ప్రైజ్‌మనీని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌కు చెక్‌ రూపంలో అందించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే.. చెక్కుపై అక్షరాల రూపంలో రెండు వేల డాలర్లు అని రాసి ఉంది. కానీ, అంకెల్లో మాత్రం 5 వేల డాలర్లుగా ఉంది.

ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ విన్నర్‌కు అందించే చెక్‌పై ఇంత పెద్ద మిస్టేక్‌ ఎలా ఉందంటూ నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌ టీమ్‌ను బకరాలను చేసిందంటూ సెటైర్ల వర్షం కురిపించారు. సోషల్‌ మీడియాలో ఈ ఘటన వైరల్‌ కావడంతో స్పందించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు క్షమాపణలు చెప్పింది. అయితే.. నిజానికి గ్రౌండ్‌ రైట్స్‌ హోల్డర్‌ ఆ చెక్కును రూపొందించిందని, ఏది ఏమైనా ఇందుకు లంక క్రికెట్‌ బోర్డు పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పి హుందాగా వ్యవహరించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ధనుంజయ డిసిల్వా 122 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి లంకను ఆదుకున్నాడు. పాక్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్‌ మంచి లీడ్‌ సాధించింది. పాక్‌ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ 208 రన్స్‌ చేసి ఔరా అనిపించాడు. ఇక లంకను రెండో ఇన్నింగ్స్‌లో 279 పరుగులకే ఆలౌట్‌ చేసిన పాక్‌.. 6 వికెట్ల నష్టానికి 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌ తర్వాత చెక్‌ తప్పిదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత కెప్టెన్‌కు అవమానం! విరుచుకుపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

Show comments