ఛాన్స్ వస్తే పాకిస్థాన్​లో ఆడతా.. టీమిండియా స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kuldeep Yadav Excited To Play In Pakistan: క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. ఓ టీమిండియా స్టార్​ కూడా ఇలాగే ఓ దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే పాకిస్థాన్​లో ఆడతానని చెబుతున్నాడు.

Kuldeep Yadav Excited To Play In Pakistan: క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. ఓ టీమిండియా స్టార్​ కూడా ఇలాగే ఓ దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే పాకిస్థాన్​లో ఆడతానని చెబుతున్నాడు.

క్రికెటర్లకు కొన్ని ఫేవరెట్ గ్రౌండ్స్ ఉంటాయి. నచ్చిన దేశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్లి ఆడాలని కోరుకుంటారు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి సిరీస్​ను గుర్తుండిపోయేలా మలచుకోవాలని అనుకుంటారు. ఓ టీమిండియా స్టార్​ కూడా ఇలాగే ఒక దేశంలో ఆడాలని అనుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే తప్పకుండా అక్కడ ఆడతానని చెబుతున్నాడు. అయితే అతడు చెప్పిన దేశంలో భారత జట్టు క్రికెట్​ ఆడక చాలా ఏళ్లు అవుతోంది. ఆ భారత స్టార్ ఛాన్స్ వస్తే ఆడతానని అంటున్న దేశం మరేదో కాదు.. పాకిస్థాన్​. అవకాశం వస్తే దాయాది దేశానికి వెళ్లి ఆడతానని అంటున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అతడు ఇంకా ఏమేం అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వచ్చే ఏడాది ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ టోర్నమెంట్​కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే టోర్నీలోని మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్​ను కూడా ఐసీసీకి సమర్పించింది పాక్. అయితే ప్లేయర్ల సేఫ్టీ, ఇతర కారణాల వల్ల పాక్​కు వెళ్లేది లేదని భారత్ చెబుతోంది. దీంతో ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా దాయాది దేశానికి వెళ్తుందా? లేదా బీసీసీఐ కోరుతున్నట్లు హైబ్రిడ్ మోడల్​లో భారత మ్యాచుల్ని ఇతర దేశంలో నిర్వహిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ ఈ అంశంపై రియాక్ట్ అయ్యాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే టీమ్​తో కలసి తప్పకుండా పాక్​కు వెళ్లి అక్కడ ఆడతానని అతడు అన్నాడు. క్రికెటర్లుగా ఎక్కడికి పంపినా వెళ్లేందుకు తాము రెడీగా ఉంటామని చెప్పాడు కుల్దీప్.

‘క్రికెటర్లుగా ఎక్కడికి పంపినా వెళ్లేందుకు, ఆడేందుకు మేం రెడీగా ఉంటాం. అది మా రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు ఎప్పుడూ పాకిస్థాన్​కు వెళ్లలేదు. ఒకవేళ అక్కడికి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్లి ఆడతా’ అని కుల్దీప్ స్పష్టం చేశాడు. ఓ ఈవెంట్​లో పాల్గొన్న కుల్దీప్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్​కు వెళ్తారా? అనే ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. ఇక, సరిహద్దు సమస్యలు, ఇతర కారణాల వల్ల భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరిగి చాన్నాళ్లు కావొస్తోంది. ఆసియా కప్ లేదా ఐసీసీ టోర్నమెంట్స్​లో తప్పితే ఈ రెండు జట్లు మరే సిరీస్​లోనూ తలపడటం లేదు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్​కు భారత జట్టును పంపాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి.. పాక్​కు వెళ్లి ఆడతానంటూ కుల్దీప్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments